ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ బ్యాంకు సేఫ్ డిపాజిటర్లకు షాకిచ్చింది. మార్చి 31, 2020 నుండి స్మాల్, మీడియం, లార్జ్ సేఫ్ డిపాజిట్ లాకర్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పెంచిన వివరాలను వెబ్ సైట్లో ఉంచింది.

రూ.500 నుండి రూ.3,000 వరకు పెరిగిన లాకర్ ఛార్జీలు
సైజ్ లాకర్, నగరాన్ని బట్టి ఛార్జీలు మారుతాయి. రూ.500 నుంచి రూ.3,000 వరకు ఛార్జీలు మారాయి. ఎస్బీఐ అన్ని బ్రాంచీలలోను 33 శాతం వరకు ఛార్జీలు పెరిగాయి. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకులలోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ లాకర్ల ఛార్జీలు పెరిగాయి.

స్మాల్ లాకర్స్
ఎస్బీఐ స్మాల్ లాకర్ కావాలంటే మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.1,500 చెల్లించాలి. ఇదివరకటి కంటే ఈ రెండు చోట్ల రూ.500 పెరిగింది.

మీడియం లాకర్స్ ఛార్జ్ పెంపు రూ.1,000
ఎస్బీఐ మీడియం లాకర్స్ కావాలంటే మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.3,000 ఉండగా మార్చి 31 తర్వాత నుండి రూ.4,000గా ఉంటుంది. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 నుండి రూ.3,000కు పెరుగుతోంది. అంటే రెండు చోట్ల రూ.1,000 పెరుగుతోంది.

లార్జ్ లాకర్స్
ఎస్బీఐ లార్జ్ లాకర్స్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.వెయ్యి పెరిగి.. రూ.6,000 నుండి రూ.8,000కు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.వెయ్యి పెరిగి రూ.5వేల నుండి రూ.6వేలుగా ఉంది.

ఎక్స్ట్రా లార్జ్ లాకర్స్
ఎస్బీఐ ఎక్స్ట్రా లార్జ్ లాకర్స్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.3వేలు పెరిగి రూ.9వేల నుండి రూ.12,000కు, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.2వేలు పెరిగి రూ.7వేల నుండి రూ.9వేలగా ఉంది. లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు జీఎస్టీ అదనంగా ఉంటుంది.

ఏమిటీ బ్యాంకు లాకర్?
బ్యాంకులు సేఫ్ డిపాజిట్ లాకర్స్ను అందిస్తున్నాయి. కస్టమర్లు తమ విలువైన వస్తువులు దాచి పెట్టేందుకు డిఫరెంట్ సైజ్ లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్ను లాకర్ లేదా జాయింట్ హైరర్ మాత్రమే ఆపరేట్ చేయగలరు. దీనిని జాయింట్గా లేదా ఇండివిడ్యువల్గా ఆపరేట్ చేయవచ్చు.

జరిమానా.. లాకర్ ఆపరేట్
లాకర్ ఛార్జీలు చెల్లించకుంటే 40 శాతం జరిమానా పడుతుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు లాకర్ను ఏడాదికి ఒకసారి ఆపరేట్ చేయాలి. లేదంటే దానిని బ్యాంకులు తెరిచే వీలు ఉంది. అయితే తెరవడానికి ముందు కస్టమర్లకు నోటీసులు పంపిస్తారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications