ఈ నెల నుండి(ఏప్రిల్) పీఎఫ్ రూల్స్ మారిన విషయం తెలిసిందే. వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత జీవనం సాగించేందుకు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం ప్రావిడెంట్ ఫండ్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తామని ప్రకటించారు.

పెట్టుబడులు నిలువరించేందుకు
మొదట ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం ఒక సంస్థ యాజమాన్యం, ఉద్యోగి సంయుక్తంగా ఉద్యోగి ఖాతాలో జమచేసే పీఎఫ్ రూ.2.5 లక్షలు దాటితే దానిపై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది. సాధారణ ప్రజలకు రిటైర్మెంట్ ఫండ్గా ఉపకరించే ప్రావిడెంట్ ఫండ్లో కొంతమంది వ్యక్తిగతంగా పన్ను మినహాయింపు కోసం భారీగా పెట్టుబడులు చేయకుండా నిలువరించేందుకే ఈ నిబంధనను తెచ్చారు.

యజమాని 12 శాతం వాటా దాటితే..
పన్ను చట్టం ప్రకారం ఉద్యోగి వేతనంలో ఉద్యోగి వేతనంలో 12 శాతం, యాజమాని వాటా నుండి మరో 12 శాతం మొత్తం 24 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది మార్చి నెల వరకు యాజమాన్యాల కంట్రిబ్యూషన్ 12 శాతానికి పన్ను మినహాయింపు ఉండేది. ఒకవేళ 12 శాతం దాటితే మాత్రం పన్ను ఉండేది.

అలా మినహాయింపు
తాజా నిబంధనల ప్రకారం ఈ నెలలో ఉద్యోగులు తీసుకునే వేతనంలో ఈ నిబంధన ప్రభావం ఉంటుంది. ఉద్యోగి మాత్రమే పీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూట్ చేసినా రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. పీఎఫ్ ఖాతాలో జమ చేసిన వారిలో 93 శాతం మంది ఉద్యోగులు రూ.2.5 లక్షల లోపు లబ్ధిపొందుతారని నిర్మల చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications