ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సభ్యులకు ఇక నుండి గరిష్టంగా రూ.7 లక్షల జీవితబీమా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం గరిష్ట బీమా రూ.6 లక్షలుగా ఉంది. దీనిని రూ.7 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు నిర్ణయించగా, దీనికి కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. 2020 సెప్టెంబర్ 9 నాటి ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో కేంద్రమంత్రి గాంగ్వార్ అధ్యక్షతన బీమా కవరేజీని రూ.7 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.

గరిష్ట ప్రయోజనం
ఎంప్లాయీస్ డిపాజిట్ అనుసంధాన బీమా (EDLI) పథకం 1976 కింద గరిష్ట ప్రయోజనాన్ని రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచుతూ ఈపీఎఫ్ఓ ట్రస్టీల కేంద్ర బోర్డు గత ఏడాది సెప్టెంబర్ సమావేశంలో నిర్ణయింయించింది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనిని అమల్లోకి తెచ్చినట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.

కనీస బీమా
ఈపీఎఫ్ఓ సభ్యులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీం 1976 (EDIL) కింద బీమా కవరేజీ అమవుతోంది. దీని కింద బీమా రూ.2.5 లక్షలుగా ఉంది. మరణానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పని చేసినా బీమా సదుపాయం వర్తింపచేయాలని గత ఏడాది నిర్ణయించింది. గతంలో చనిపోవడానికి ముందు 12 నెలల్లో సభ్యుడు ఒకటికి మించిన సంస్థల్లో పని చేస్తే బీమా సదుపాయం ఉండేది కాదు. కానీ దీనిని గత ఏడాది మార్చారు.

30 రెట్ల బీమా సదుపాయం
ఉద్యోగి మరణానికి ముందు పన్నెండు నెలల్లో అందుకున్న సగటు వేతనానికి (మూలవేతనం, కరువు భత్యం కలిపి) 30 రెట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది. బీమా కవరేజీకి ఉద్యోగి కనీసం ఇంతకాలం పని చేయాలనే నిబంధన ఏదీ లేదు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications