జనవరి 1వ తేదీ నుండి కాంటాక్ట్లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2వేల నుండి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల తెలిపారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ ఇష్టానుసారం కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.2వేల వరకు చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్ పిన్ నెంబర్ లేకుండా జరుపుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5,000కు పెంచుతున్నారు.

కాంటాక్ట్లెస్ చెల్లింపులు పెరుగుతాయి
అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరింత భద్రమైన, సురక్షితమైన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందించడంలో భాగంగా కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్, ఈ-మాండేట్స్ పరిమితిని పెంచడం వంటి నిర్ణయం సురక్షితమేనా అనే చర్చ సాగుతోంది. కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. తాజా నిర్ణయంతో షాప్స్, మాల్స్ సహా వివిధ ప్రాంతాల్లో కాంటాక్ట్లెస్ చెల్లింపులు పెరుగుతాయి. అయితే సురక్షితంగా ఉండేందుకు వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తున్నారు.

పాస్ వర్డ్ బలంగా..
బ్యాంకు ఖాతాలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు పాటించినట్లు, మొబైల్ ఫోన్స్, ఆన్లైన్ వ్యాలెట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కాంటాక్ట్లెస్ బ్యాంకు ఖాతాకు సంబంధించి కార్డును సురక్షితంగా పెట్టుకోవాలి. కార్డును ఎవరికీ ఇవ్వవద్దు. బలమైన పాస్ వర్డ్స్ ఉండాలి.

కార్డుపోతే..
కార్డు పోగొట్టుకుంటే వెంటనే బ్యాంకు కస్టమర్ సెంటర్కు ఫోన్ చేసి చెప్పాలి. కార్డును బ్లాక్ చేయించుకోవాలి. మీ ఖాతాకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు వెళ్లి చూసుకోవాలి. మీ పాస్ వర్డును ఎవరితోను పంచుకోవద్దు. కార్డును ఎక్కడా మరిచిపోకుండా చూసుకోవాలి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications