బంగారం ధరలు ఈరోజు (ఆగస్ట్ 3) పెరిగాయి. కరోనా కేసులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి వివిధ కారణాల ప్రభావం దేశీయ పసిడి మార్కెట్ పైన పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం 0.08 శాతం పెరిగి రూ.53,490 పలికింది. రూ.54,000కు చేరువలో ఉంది. వెండి ఫ్యూచర్స్ రూ.700 లేదా 1.1 శాతం పెరిగి కిలో రూ.65,690గా ఉంది. కరోనా వెలుగుచూసినప్పటి నుండి బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ వారం పసిడి ధర ఎలా ఉండవచ్చు
పసిడి అక్టోబర్ కాంట్రాక్ట్ రూ.54,271 ఎగువకు వెళ్తే మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. లేదంటే స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. స్థిరత్వం చోటు చేసుకుంటే ఆ తర్వాత కాంట్రాక్ట్ రూ.52 వేలకు పైన, ఆ తర్వాత రూ.52వేల దిగువకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
వెండి ధర రూ.63,285 దిగువకు రాకుంటే సానుకూలంగా ఉండవచ్చునని, అయితే మరింతగా పెరిగే అవకాశాలు తక్కువే అంటున్నారు. లాభాలు స్వీకరించవచ్చునని సూచిస్తున్నారు.

2,000 డాలర్ల దిశగా బంగారం
గత సెషన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.650(1.2 శాతం) పెరిగింది. అలాగే వెండి రూ.2,300(3.6 శాతం) ఎగిసింది. ఈ జనవరి నుండి మన దేశంలో బంగారం ధరలు 35 శాతం పెరిగి, సరికొత్త గరిష్టాన్ని తాకాయి. ఇంతకుముందు సెషన్లో ఓ సమయంలో బంగారం రూ.53,700 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాత ఎగిసి ఔన్స్ 1,976.47 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో 1,984 కూడా పలికింది. 2,000 డాలర్ల సమీపానికి వచ్చింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.1 శాతం తగ్గి ఔన్స్కు 24.35, పల్లాడియం 1.1 శాతం తగ్గి 2,068.98 డాలర్లకు చేరుకుంది.

జూలైలో రికార్డ్ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో జూలై నెలలో బంగారం ధర ఏకంగా 11 శాతం ఎగిసింది. నెలవారీగా చూస్తే 2012 తర్వాత ఇది రికార్డ్. ఔన్స్ ధర సింగపూర్ మార్కెట్లో బంగారం 2,009.50 డాలర్లకు, స్పాట్ 24,3212 డాలర్లకు చేరుకుంది. దేశీయంగా కూడా జూలై నెలలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. పసిడి ఒక్క నెలలోనే పదకొండు శాతం పెరుగుదలతో ఎనిమిదేళ్ల రికార్డులను చేరుకుందని బులియన్ మార్కెట్ నిపుణులు మనోజ్ జైన్ అన్నారు.

బంగారం ధరలు..
బంగారం ధరలు గత రెండు వారాలుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.56,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగింది. ఢిల్లీలోను బంగారం రూ.260 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ.53,460, 22 క్యారెట్ల బంగారం రూ.52,260 పలికింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications