బంగారం, వెండి ధరలు రోజురోజుకు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,000 దాటింది. కిలో వెండి రూ.66,400 పలికింది. ఢిల్లీలో పసిడి రూ.905 పెరిగి రూ.52,960, వెండి కిలో రూ.3,350 పెరిగి రూ.65,670కి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1939 డాలర్లకు, వెండి 24.30 డాలర్లకు చేరుకుంది. కరోనా కారణంగా తొలుత భారీగా పెరిగిన ధరలు, ఇటీవల కొద్ది రోజులు అంతగా పెరగలేదు. తిరిగి గత వారం నుండి అందనంత ఎత్తుకు పెరుగుతున్నాయి.

రిటైల్ వ్యాపారుల ఆందోళన..
ఉద్దీపనలు, డాలర్ వ్యాల్యూ తగ్గడం, పలు దేశాల్లో కరోనా మరణాలు పెరగడం వంటి పలు కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా కారణం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడుతోంది. మన విషయానికి వస్తే దేశంలో పెళ్లిళ్లు, పండుగల సీజన్ ప్రారంభం అవుతోంది. ధరలు పెరగడం పట్ల రిటైల్ ట్రేడర్స్ కూడా ఆందోళనగా ఉన్నారు. ఇలా పెరుగుతుంటే కొనుగోలుకు ఆసక్తి చూపించే అవకాశాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. వాస్తవానికి దేశీయంగా, అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రిటైల్ వ్యాపారాలు తగ్గిపోయాయి. రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేసే సాధారణ ప్రజలు.. ధరలను చూసి భయపడుతున్నారు.

కొద్ది వారాల్లో రూ.2,000
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొద్ది వారాల్లోనే 2000 డాలర్లకు చేరుకోవచ్చుననిబులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.820 పెరిగి రూ.54,300, 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,730కి చేరుకుంది. హైదరాబాద్లో రూ.55వేల దిశగా వెళ్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.906 పెరిగి రూ.52,960, ముంబైలో ఏకంగా రూ.1,395 పెరిగి రూ.52,519కి చేరుకుంది. వెండి ఢిల్లీలో రూ.3,300కు పైగా, ముంబైలో రూ.4,600కు పైగా పెరిగింది.

10 రోజుల్లో రూ.12వేలు పెరిగిన వెండి ధర
పారిశ్రామిక కొనుగోళ్ల మద్దతుతో వెండి ధర పెరుగుతోంది. వెండి గత పది రోజుల్లో రూ.12వేలు పెరిగింది. ఈ వారం కూడా ధరల పెరుగుదల ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మార్చి వరకు స్వల్పంగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఆ తర్వాత ఊపందుకున్నాయి. గత వారం రోజులుగా మరీ పుంజుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయనే అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్లో అరవై శాతం వాటా వరకు పారిశ్రామికవర్గాలదే. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో ధరలు ఇలా పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ దీపక్ చెప్పారు.

ఇన్వెస్టర్ల ఆసక్తి..
కరోనాను తగ్గించేందుకు అమెరికా పాలక వర్గం, ఫెడ్ రిజర్వ్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ అధికం. అమెరికా, యూరోప్ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. ఫెడ్ రిజర్వ్ ప్యాకేజీ ప్రకటన అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో కరెన్సీని (పెరుగుదల) చూస్తున్నారు. ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూస్తుండటంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బంగారం త్వరలోనే 2000 డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications