పెట్టుబడిదారులకు సురక్షిత, భరోసాతో కూడిన రాబడిని అందించే పథకాల్లో ఇండియా పోస్టాఫీస్ స్కీమ్స్ ఉంటాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పెట్టుబడితో వడ్డీ రేటు తద్వారా రిటర్న్స్ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పని తీరు పైన ఆధారపడవు. కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. సురక్షిత పెట్టుబడులు కావాలనుకునే వారు తమ భవిష్యత్తు కోసం ఇండియా పోస్ట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలాంటి పథకాల్లో గ్రామ సురక్ష పథకం ఒకటి. ఈ పథకం కింద నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత రూ.35 లక్షలు చేతికి వస్తాయి.

చేతికి రూ.31 లక్షలకు పైగా
ఈక్విటీ మార్కెట్లో రాబడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ పుంజుకుంటే మాత్రం ఇతర సురక్షిత పెట్టుబడి కంటే రాబడి అధికంగా ఉంటుంది. అయితే రిస్క్ తీసుకోలేనివారికి మాత్రం వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ పోస్టాఫీస్ స్కీం పథకాలు మంచిది. అందులోను ఎక్కువ వడ్డీ ఉన్న దానిని ఎంచుకోవచ్చు. మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడి సాధనాల్లో గ్రామ సురక్ష పథకం.
పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ ప్లాన్ అత్యుత్తమ ఎంపిక. ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. రాబడులు కూడా కాస్త బాగుంటాయి. నష్టపరిహారం చాలా తక్కువ. ఇండియా పోస్ట్ అందించే గ్రామ సురక్ష పథకం ప్రొటెక్షన్ ప్లాన్ తక్కువ రిస్క్తో మంచి రాబడిని ఇస్తుంది. రూ.1500 పెట్టుబడితో మెచ్యూరిటీ తర్వాత రూ.31 లక్షల నుండి రూ.35 లక్షలు చేతికి వస్తుంది.

ఈ పెట్టుబడికి నిబంధనలు
- భారతీయుడై ఉండాలి. 19 ఏళ్ల నుండి 55 ఏళ్ల వయస్సు కలిగిన ఎవరైనా ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
- గ్రామ సురక్ష పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుండి రూ.10 లక్షలు.
- పోస్టాఫీస్ పథకం కింద ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా, వార్షికంగా చెల్లించవచ్చు.
- ప్రీమియం చెల్లింపుకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.
- గ్రామ సురక్ష పథకంలో చేరితో రుణాలు కూడా అందుబాటులో ఉంటాయి.
- ఈ పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత దీనిని సరెండర్ చేయవచ్చు. అయితే మెచ్యూరిటీ తీరకముందే సరెండర్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు.

బెనిఫిట్ ఇలా..
ఉదాహరణకు ఓ వ్యక్తి పోస్టాఫీస్ పథకంలో పందొమ్మిది ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన గ్రామ సురక్ష పాలసీని కొనుగోలు చేస్తే 55 ఏళ్ల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515 అవుతుంది. 58 ఏళ్లకు రూ.1463, అలాగే 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాలి. 55 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications