2022 జనవరి 1(వచ్చే నెల) నుండి ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకునే వారికి షాక్! పరిమితికి మించి చేసే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పైన విధించే ఛార్జీలు వచ్చే నెల నుండి పెరగవచ్చు. ఏటీఎం వద్ద నెలవారీగా బ్యాంకులు అందిస్తున్న ఉచిత పరిమితికి మించజి నగదు, నగదురహిత ట్రాన్సాక్షన్స్కు విధించే ఛార్జీలను జనవరి 2022 నుండి పెంచేందుకు ఆర్బీఐ ఈ ఏడాది జూన్ నెలలో అనుమతించింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు యాక్సిస్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకు ఏటీఎంల వద్ద ఉచిత పరిమితిని దాటి ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే జనవరి 1, 2022 నుండి ట్రాన్సాక్షన్ ఛార్జీ రూ.21 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంకు తెలిపింది.
నెలవారి పరిమితికి మించి ఏటీఎం వద్ద చేసే ప్రతీ ట్రాన్సాక్షన్కు ప్రస్తుతం రూ.20 ఛార్జ్ చేస్తున్నారు. అధిక ఇంటర్చేంజ్ ఫీజు భర్తీ చేసేందుకు, అలాగే సాధారణ ఖర్చులు పెరగడంతో కస్టమర్ ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎంల నుండి ప్రతి నెలా అయిదు ఉచిత ట్రాన్సాక్షన్ (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా), ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాలలో మూడు, నాన్-మెట్రో నగరాలలో అయిదు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఇది కాకుండా, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ కోసం ప్రతి ట్రాన్సాక్షన్కు ఇంటర్చేంజ్ ఫీజును రూ.15 నుండి రూ.17కు, ఆర్థికేతర ట్రాన్సాక్షన్కు రూ.5 నుండి రూ.6 వరకు పెంచేందుకు కూడా సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. ఇది ఆగస్ట్ 1, 2021 నుంచి అమలులోకి వచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications