ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనున్న ఎస్బిఐ?
ఈ నెల చివరి లోపు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది
ఈ నెల చివరి లోపు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది లేనిచో వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ బ్లాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. బ్యాంక్ కార్పొరేట్ వెబ్సైట్లో ఒక బ్యానర్ ప్రకారం, వినియోగదారులు వారి మొబైల్ నంబర్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు ఉపయోగించాలనుకుంటే నవంబరు 30 లోపు నమోదు చేసుకోవాలి. "నవంబర్ 30, 2018 నాటికి మీ మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేసుకోండి, డిసెంబర్ 1, 2018 నుండి ఈ నిబంధన అమలులోకి రావచ్చు అని ఎస్బిఐ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఎస్ఎంఎస్ హెచ్చరికల కోసం
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల ఎస్ఎంఎస్ హెచ్చరికల కోసం మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మార్గదర్శకాలను సూచించింది.
జూలై 2017 లో
జూలై 2017 లో ఆర్బిఐ జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం, మొబైల్ నంబర్లను అందించని వినియోగదారులకు, ఎటిఎమ్ నగదు ఉపసంహరణ తప్ప మిగతా ఏ ఎలక్ట్రానిక్ లావాదేవీల వంటి బ్యాంకుల సౌకర్యాలను అందించవు. ఎస్బిఐ వెబ్సైట్ వినియోగదారులు వారి మొబైల్ నంబర్ను బ్యాంక్తో నమోదు చేయడం ద్వారా జతచేస్తుంది బ్యాంకు సేవలను "నిరంతరాయ" పద్ధతిలో ఆస్వాదించవచ్చని పేర్కొంది.
మొబైల్ నంబర్ ఎస్బిఐతో ఎలా నమోదు చేయాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తమ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, వారికి సంబందించిన బ్రాంచిని సందర్శించడం ద్వారా లేదా ఎటిఎం ద్వారా గాని చేయగలరు. ఒక ATM ద్వారా సంఖ్య నమోదు చేయడానికి ఈ దశలను అనుసరించండి -
1. వినియోగదారులు వారి కార్డును స్వైప్ చేసి 'రిజిస్ట్రేషన్' ఎంపికను ఎంచుకోవాలి.
2. ATM పిన్ను నమోదు చేయండి.
3. మొబైల్ సంఖ్య నమోదు ఎంపికను ఎంచుకోండి.
4. సంఖ్యను నమోదు చేయండి మరియు సంఖ్యను తిరిగి తనిఖీ చేసిన తర్వాత 'సరైన' ఎంపికను ఎంచుకోండి.
5. నంబర్ను మళ్లీ నమోదు చేయండి మరియు 'సరైన' ఎంపికను ఎంచుకోండి.
6."మీ మొబైల్ నంబర్ ను మాతో రిజిస్టర్ చేసినందుకు ధన్యవాదాలు" అనే ఒక సందేశం కనిపిస్తుంది.
7. బ్యాంక్ మూడు రోజులలోపు కస్టమర్లను సంప్రదిస్తుంది మరియు రిఫరెన్స్ నంబర్ SMS ద్వారా వారి మొబైల్ ఫోన్కు పంపుతుంది.
8. వ్యక్తిగత వివరాలను ధృవీకరించండి మరియు ఆ నంబర్ను బ్యాంకుతో నమోదు చేయాలి.
ట్విట్టర్ ద్వారా
ఈ ఏడాది ప్రారంభంలో బ్యాంక్ తన అధికార ట్విట్టర్ ద్వారా తమ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాలని కోరిందనే విషయాన్నీ గుర్తుచేశారు.ఎటిఎమ్ క్యాష్ విత్డ్రాయల్స్ సౌకర్యం మాత్రమే ఉంటుంది ఇతర ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు మరియు ఎలక్ట్రానిక్ లావాదేవీలు పొందేందుకు అన్ని ఎస్బీఐ ఖాతాలకు మొబైల్ నంబరు నమోదు తప్పనిసరి అని ట్వీట్ చేసింది.