ఈ నెల చివరి లోపు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది
ఈ నెల చివరి లోపు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది లేనిచో వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ బ్లాక్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. బ్యాంక్ కార్పొరేట్ వెబ్సైట్లో ఒక బ్యానర్ ప్రకారం, వినియోగదారులు వారి మొబైల్ నంబర్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు ఉపయోగించాలనుకుంటే నవంబరు 30 లోపు నమోదు చేసుకోవాలి. "నవంబర్ 30, 2018 నాటికి మీ మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేసుకోండి, డిసెంబర్ 1, 2018 నుండి ఈ నిబంధన అమలులోకి రావచ్చు అని ఎస్బిఐ తన వెబ్సైట్లో పేర్కొంది.

ఎస్ఎంఎస్ హెచ్చరికల కోసం
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల ఎస్ఎంఎస్ హెచ్చరికల కోసం మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మార్గదర్శకాలను సూచించింది.

జూలై 2017 లో
జూలై 2017 లో ఆర్బిఐ జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం, మొబైల్ నంబర్లను అందించని వినియోగదారులకు, ఎటిఎమ్ నగదు ఉపసంహరణ తప్ప మిగతా ఏ ఎలక్ట్రానిక్ లావాదేవీల వంటి బ్యాంకుల సౌకర్యాలను అందించవు. ఎస్బిఐ వెబ్సైట్ వినియోగదారులు వారి మొబైల్ నంబర్ను బ్యాంక్తో నమోదు చేయడం ద్వారా జతచేస్తుంది బ్యాంకు సేవలను "నిరంతరాయ" పద్ధతిలో ఆస్వాదించవచ్చని పేర్కొంది.

మొబైల్ నంబర్ ఎస్బిఐతో ఎలా నమోదు చేయాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తమ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, వారికి సంబందించిన బ్రాంచిని సందర్శించడం ద్వారా లేదా ఎటిఎం ద్వారా గాని చేయగలరు. ఒక ATM ద్వారా సంఖ్య నమోదు చేయడానికి ఈ దశలను అనుసరించండి -
1. వినియోగదారులు వారి కార్డును స్వైప్ చేసి 'రిజిస్ట్రేషన్' ఎంపికను ఎంచుకోవాలి.
2. ATM పిన్ను నమోదు చేయండి.
3. మొబైల్ సంఖ్య నమోదు ఎంపికను ఎంచుకోండి.
4. సంఖ్యను నమోదు చేయండి మరియు సంఖ్యను తిరిగి తనిఖీ చేసిన తర్వాత 'సరైన' ఎంపికను ఎంచుకోండి.
5. నంబర్ను మళ్లీ నమోదు చేయండి మరియు 'సరైన' ఎంపికను ఎంచుకోండి.
6."మీ మొబైల్ నంబర్ ను మాతో రిజిస్టర్ చేసినందుకు ధన్యవాదాలు" అనే ఒక సందేశం కనిపిస్తుంది.
7. బ్యాంక్ మూడు రోజులలోపు కస్టమర్లను సంప్రదిస్తుంది మరియు రిఫరెన్స్ నంబర్ SMS ద్వారా వారి మొబైల్ ఫోన్కు పంపుతుంది.
8. వ్యక్తిగత వివరాలను ధృవీకరించండి మరియు ఆ నంబర్ను బ్యాంకుతో నమోదు చేయాలి.

ట్విట్టర్ ద్వారా
ఈ ఏడాది ప్రారంభంలో బ్యాంక్ తన అధికార ట్విట్టర్ ద్వారా తమ వినియోగదారులను రిజిస్టర్ చేసుకోవాలని కోరిందనే విషయాన్నీ గుర్తుచేశారు.ఎటిఎమ్ క్యాష్ విత్డ్రాయల్స్ సౌకర్యం మాత్రమే ఉంటుంది ఇతర ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు మరియు ఎలక్ట్రానిక్ లావాదేవీలు పొందేందుకు అన్ని ఎస్బీఐ ఖాతాలకు మొబైల్ నంబరు నమోదు తప్పనిసరి అని ట్వీట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications