కస్టమర్లకు యస్ బ్యాంకు ఊరటనిచ్చే ట్వీట్ చేసింది. యస్ బ్యాంకు డెబిట్ కార్డ్స్ను ఉపయోగించే ఏ ఏటీఎం నుండి అయినా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని పేర్కొంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. ఓపిక వహించినందుకు కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ట్వీట్లో ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్ను ట్యాగ్ చేసింది.

కస్టమర్ల ఇబ్బందులు
యస్ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పని చేయడం లేదని, ఏటీఎంలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చెక్కు ద్వారా డబ్బులు ఉపసంహరించుకుంటామని కస్టమర్లు అంటున్నారు. ఆర్బీఐ మారటోరియం అనంతరం యస్ బ్యాంకు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సమయంలో బ్యాంకు ట్వీట్ చేసింది.

బ్యాంకు, ఏటీఎం వద్ద బారులు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు కస్టమర్లు నెలకు నగదు విత్ డ్రా పరిమితిని రూ.50,000కు చేసింది. దీంతో కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు నాలుగు రోజులుగా ఆ బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద భారీ సంఖ్యలో బారులుతీరారు. గురువారం సాయంత్రం నుంచి యస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ పని చేయడం లేదని, నగదు ఉపసంహరణకు ప్రయత్నిస్తుంటే కనెక్షన్ ఎర్రర్ అని సమాధానం వస్తోందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెయిట్ చేయాలని..
యస్ బ్యాంకులో తమ ఖాతాలు మూసివేస్తామని, కానీ నెట్ బ్యాంకింగ్ పని చేయడం లేదని, దీంతో ఆన్లైన్లో ఎలా చేయాలో తెలియడం లేదని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ కోసం కాస్త వెయిట్ చేయాలని యస్ బ్యాంకు కూడా మూడు రోజుల క్రితం సూచించింది. బ్యాంకింగ్ టోల్ ఫ్రీ నంబర్ 18001200 నుంచి 18002000కు మార్చింది.

చెక్స్ ద్వారా రూ.50,000
కస్టమర్లు ఏటీఎంల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా ఏటీఎంలలో డబ్బులు అయిపోయాయి. ఎక్కువ మంది చెక్స్ ద్వారా రూ.50,000 విత్ డ్రా చేసుకుంటున్నారు. కొంతమందికి క్రిడెట్/డెబిట్ కార్డులు పని చేయలేదు. కానీ వీటిని ఇప్పుడు ఉపయోగించవచ్చునని బ్యాంకు ట్వీట్ చేసింది.

మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్
యస్ బ్యాంకు ఫౌండర్ రానా కపూర్ను ఈడీ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఆయన ఇంటిలో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం వెస్ట్ ముంబైలోని సముద్ర మహల్ ఇంటిపై దాడులు నిర్వహించింది. రానాను 20 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం PMLA నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రానా కపూర్ ముగ్గురు కూతుళ్లు, ఇళ్ళలో కూడా శనివారం శోధించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications