ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రయాణాలు ఆగిపోయాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ప్రయాణాల పైన ఎక్కువ ప్రభావం పడినట్లు ఈవై సర్వేలో వెల్లడైంది. మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ విధించడంతో పాటు విమాన ప్రయాణాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తొమ్మిది నెలలుగా కరోనా కారణంగా అత్యధిక ప్రయాణాలు నిలిచిపోయినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు ఈవై తెలిపింది.

భారత్లోనే తక్కువ...
చైనా, అమెరికా సహా 9 దేశాల్లో పని, సామాజిక, గృహ ప్రయాణాలను పరిగణలోకి తీసుకుంటే భారత్లోనే ఎక్కువగా తగ్గిపోయినట్లు ఈ సర్వే తెలిపింది. ప్రయాణాలు తగ్గిపోవడంతో వివిధ నగరాల్లో కాలుష్యం కూడా తగ్గినట్లు ఈ సర్వే తెలిపింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వంటి వివిధ కారణాలతో జనాలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కొంతమంది కార్యాలయాలకు సొంత వాహనాలపై వెళ్తున్నారని, దీంతో స్వయం ప్రతిపత్తి లభించినట్లయిందన్నారు. రాకపోకలకు ప్రజలు వెచ్చించే సమయం మిగులుతోందన్నారు.

ప్రయాణం ఎంత తగ్గిందంటే
భారత్ విషయానికి వస్తే వర్క్ ట్రావెల్ దాదాపు 69 శాతం తగ్గిందని ఈ సర్వేలో వెల్లడైంది. సామాజిక ప్రయాణాలు 59 శాతం, గృహ ప్రయాణాలు 58 శాతం పడిపోయాయి. స్వీడన్ వంటి దేశంలో ప్రయాణ క్షీణత 70 శాతం ఉండగా, భారత్లోను దాదాపు అంతే ఉంది. స్వీడన్ జనాభా 1 కోటి కాగా, భారత జనాభా 138 కోట్లు. లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షల నేపథ్యంలో ప్రయాణ క్షీణత భారీగా నమోదయినట్లు తెలిపింది.

ఈ దేశాల్లో సర్వే
ఒక్కో వ్యక్తి వారానికి చేసే సరాసరి ప్రయాణ సమయం 40 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఇది ఆరు గంటల నుండి 3.7 గంటలకు పరిమితమైందని తెలిపింది. ఈ సర్వేను ఈ నెలలోనే చేసింది. మొబిలిటీ కన్స్యూమర్ ఇండెక్స్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్, చైనా, అమెరికా, యూకే, ఇటలీ, సింగపూర్, సౌత్ కొరియా, స్వీడన్, జర్మనీ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications