ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రయాణాలు ఆగిపోయాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ప్రయాణాల పైన ఎక్కువ ప్రభావం పడినట్లు ఈవై సర్వేలో వెల్లడైంది. మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ విధించడంతో పాటు విమాన ప్రయాణాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తొమ్మిది నెలలుగా కరోనా కారణంగా అత్యధిక ప్రయాణాలు నిలిచిపోయినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు ఈవై తెలిపింది.

భారత్లోనే తక్కువ...
చైనా, అమెరికా సహా 9 దేశాల్లో పని, సామాజిక, గృహ ప్రయాణాలను పరిగణలోకి తీసుకుంటే భారత్లోనే ఎక్కువగా తగ్గిపోయినట్లు ఈ సర్వే తెలిపింది. ప్రయాణాలు తగ్గిపోవడంతో వివిధ నగరాల్లో కాలుష్యం కూడా తగ్గినట్లు ఈ సర్వే తెలిపింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వంటి వివిధ కారణాలతో జనాలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కొంతమంది కార్యాలయాలకు సొంత వాహనాలపై వెళ్తున్నారని, దీంతో స్వయం ప్రతిపత్తి లభించినట్లయిందన్నారు. రాకపోకలకు ప్రజలు వెచ్చించే సమయం మిగులుతోందన్నారు.

ప్రయాణం ఎంత తగ్గిందంటే
భారత్ విషయానికి వస్తే వర్క్ ట్రావెల్ దాదాపు 69 శాతం తగ్గిందని ఈ సర్వేలో వెల్లడైంది. సామాజిక ప్రయాణాలు 59 శాతం, గృహ ప్రయాణాలు 58 శాతం పడిపోయాయి. స్వీడన్ వంటి దేశంలో ప్రయాణ క్షీణత 70 శాతం ఉండగా, భారత్లోను దాదాపు అంతే ఉంది. స్వీడన్ జనాభా 1 కోటి కాగా, భారత జనాభా 138 కోట్లు. లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షల నేపథ్యంలో ప్రయాణ క్షీణత భారీగా నమోదయినట్లు తెలిపింది.

ఈ దేశాల్లో సర్వే
ఒక్కో వ్యక్తి వారానికి చేసే సరాసరి ప్రయాణ సమయం 40 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఇది ఆరు గంటల నుండి 3.7 గంటలకు పరిమితమైందని తెలిపింది. ఈ సర్వేను ఈ నెలలోనే చేసింది. మొబిలిటీ కన్స్యూమర్ ఇండెక్స్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్, చైనా, అమెరికా, యూకే, ఇటలీ, సింగపూర్, సౌత్ కొరియా, స్వీడన్, జర్మనీ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications