Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇండస్ట్రీ డిమాండ్పై చర్చించిన తర్వాత.. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆర్థిక మండలి 2006లో వర్క్ ఫ్రమ్ హోమ్- 43A కొత్త నిబంధనను నోటిఫై చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. ఉద్యోగి గరిష్ఠంగా ఒక సంవత్సరం పాటు ఇంటి నుంచి పని చేయవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు విషయంలో ఏదైనా కంపెనీ.. గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందించే వెసులుబాటును వాణిజ్య మంత్రిత్వ శాఖ కల్పించింది.

స్పెషల్ ఎకనామిక్ జోన్ల విషయంలో..
వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రకారం.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నియమాలు స్పెషల్ ఎకనామిక్ జోన్ లేదా SEZ యూనిట్ల కోసమని పేర్కొంది. అంటే.. ఈ ప్రాంతాల్లో స్థాపితమైన కంపెనీలు ఇప్పటి నుంచి మారిన నిబంధనల ప్రకారం తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించవచ్చు.

IT ఉద్యోగులకు ప్రయోజనం..
న్యూ రూల్స్ ప్రకారం.. కొన్ని వర్గాల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయవచ్చు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), IT కి సంబంధించిన ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. తాజా నిబంధన ప్రకారం.. తాత్కాలికంగా విధులకు రాలేని ఉద్యోగులు మాత్రమే ఇంటి నుంచి పని చేయగలరని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

పరిశ్రమ డిమాండ్పై ప్రభుత్వ ఆమోదం..
ఇండస్ట్రీ వర్గాలు చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో డిమాండ్ చేస్తోందని, వాటిని పరిగణలోకి తీసుకుని కొత్త నోటిఫికేషన్ జారీ చేయబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అన్ని SEZ లు సమానంగా అమలు చేయాల్సి ఉంది. 50 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందించాల్సి వస్తే.. అందుకు అనుమతి పొందటానికి కంపెనీలు ఉద్యోగుల సంఖ్య, వర్క్ ఫ్రమ్ హోమ్ అందించటానికి గల కారణాలను SEZ డెవలప్మెంట్ కమిషనర్కు అందించి పర్మిషన్ తీసుకోవచ్చని కేంద్రం తాజా నోటిఫికేషన్లో పేర్కొంది .
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications