వచ్చే జనవరి నుండి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్స్కు మించి ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది. బ్యాంకులు ప్రస్తుతం ఒక్కో అదనపు ట్రాన్సాక్షన్ పైన రూ.20 ఛార్జ్ చేస్తున్నాయి. ఇది రూ.21కి పెరగనుంది. ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, నిర్వహణకు వ్యయాలు పెరిగాయని, ఇంటర్చేంజ్ ఫీజు కూడా పెరిగిందని, దీంతో సాధారణ ఖర్చులకు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతించినట్లు ఆర్బీఐ తెలిపింది.
పెంచిన ఛార్జీల ప్రకారం 2022 జనవరి 1వ తేదీ నుండి నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్స్ ముగిశాక చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన కస్టమర్లు రూ.21 చెల్లించవలసి ఉంటుంది. సొంత బ్యాంక్ ఏటీఎం నుండి ప్రతి నెల 5 ఉచిత లావాదావీలు(ఆర్థిక, ఆర్థికేతర కలిపి) నిర్వహించుకోవడాన్ని కొనసాగించడం కస్టమర్లకు ఊరట కలిగించే అంశం. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంక్ ఏటీఎం నుండి మూడు, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ను అనుమతిస్తారు.

ఈ ఏడాది ఆగస్ట్ 1వ తేదీ నుండి అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుండి రూ.17కు, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన రూ.5 నుండి రూ.6కు పెంచుకునే అవకాశం కల్పించింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ పైన ప్రస్తుత ఛార్జీలు 2014 నుండి, ఇంటర్చేంజ్ ఫీజు వసూలు 2012 ఆగస్ట్ నుండి అమలవుతున్నాయి. అప్పటి నుండి ఛార్జీలు పెంచలేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications