Notes Ban: దేశవ్యాప్తంగా రూ.2000 నోట్ల ఉపసంహరణపై ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది. పెద్ద నోట్లు వద్దంటూనే గతంలో మోదీ సర్కారు రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కావాలని తెచ్చి.. ఇప్పుడు మళ్లీ వాటిని వద్దనుకోవటం ఏంటని అందరూ అభిప్రాయపడుతున్నారు.
క్లీన్ నోట్ పాలసీ కారణంగా రూ.2000 నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే అది ప్రధాన కారణం కాదని చాలా మంది భావిస్తున్నారు. కరెన్సీ ఉపసంహరణ వ్యవస్థలోని మొత్తం కరెన్సీలో 86 శాతంపై ప్రభావం చూపినందున డీమోనిటైజేషన్ సమయంలో అధిక విలువ కలిగిన రూ.2,000 నోటును జారీ చేయడం తప్పనిసరిగా మారింది. త్వరగా ఆర్థిక వ్యవస్థ కుదుటపడేలా చేసేందుకు అప్పట్లో ఈ నోట్లు ఎంతగానో దోహదపడ్డాయని తెలుస్తోంది.

అయితే అధిక విలువ కలిగిన రూ.2000 నోట్లను నిల్వ చేయటం, మార్చటం సులభం కాబట్టి బ్లాక్ మార్కెటర్లు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలా కాలంగా మార్కెట్లో ఈ నోట్లు కనిపించటం లేదు. పైగా అన్ని బ్యాంకులు తమ ఏటీఎంలలో రూ.2000 నోట్లను రీకాలిబరేషన్ చేయడంతో సరిపడా రూ.2000 నోట్లు రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నాయి.
పెద్ద నోట్లను మార్కెట్ నుంచి తొలగించటానికి ప్రధాన కారణం దొంగ నోట్లను అరికట్టడం. అయితే ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ తీసుకున్న నోట్ల ఉపసంహరణ నిర్ణయం మినీ డీమానిటైజేషన్ అని చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో కరెన్సీని కలిగి ఉన్నవారు నోట్లను డిపాజిట్ చేస్తున్నట్లయితే లేదా మార్పిడి చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన మూలాన్ని వారు తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ నోట్లు తిరిగి బ్యాంకులకు రాకపోతే నిర్ణీత గడువు తర్వాత అవి విలువను కోల్పోతాయి. రిజర్వు బ్యాంక్ వాటికి ఎలాంటి చెల్లింపు చేయదు కాబట్టి RBIకి లాభం కూడా.
అయితే దేశంలోని రాజకీయ పార్టీలు మాత్రం దీనిని ఎన్నికల అస్త్రంగా భావిస్తున్నాయి. బీజేపీ కర్ణాటక ఎన్నికల ఓటమి తర్వాత ఈ నిర్ణయం రావటం కొందరిలో అనుమానాలు కలిగిస్తోంది. కొందరు విశ్లేషకులు మాత్రం ఈ రెండింటికీ సంబంధం లేదని అంటున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications