కరోనా మహమ్మారి కారణంగా భారత కుబేరుల సంపద 2020లో 4.4 శాతం క్షీణించి 12.83 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ, సైరస్ పూనావాలా సంపద పెరిగింది. ఈ మేరకు క్రెడిట్ సూయిస్ రీసెర్చ్ వెల్లడించింది. కరోనా కారణంగా బిలియనీర్ల సంపద తగ్గడంతో వారి సంఖ్య కూడా తగ్గింది. ఈ ముగ్గురి సంపద పెరిగినప్పటికీ బిలియనీర్ల సంపద, సంఖ్య తగ్గింది. 2019తో పోలిస్తే 59,400 కోట్ల డాలర్లు అంటే 4.4 శాతం తగ్గి 2020లో 12.833 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది మన కరెన్సీలో రూ.962 లక్షల కోట్లు. రూపాయి పతనం ఇందుకు కారణమని తెలిపింది.

భారత్ వాటా 1 శాతం
డాలర్ రూపంలో మిలియనీర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా, 2020లో 6,98,000కు పరిమితమైంది. వీరి మొత్తం సంపద వ్యాల్యూ 2019 కంటే 4.4 శాతం (594 బిలియన్ డాలర్లు) తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్ల (రూ.962 లక్షల కోట్లు)గా ఉంది. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ వాటా 1 శాతంగా ఉంది. 2025 నాటికి భారత్లో మిలియనీర్ల సంఖ్య 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి.

సంపద పెరిగింది
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య 52 లక్షల కోట్లు పెరిగి 5.61 కోట్లకు చేరుకుంది. వీరి సంపద వ్యాల్యూ 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2020లో సగటున భారత్లో ప్రతి యువకుడు/యువతి వద్ద 14,252 డాలర్ల ఆదాయం ఉంది. 2000 సంవత్సరం నుండి ఇది ప్రతి ఏటా 8.8 శాతం పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8 శాతంగా మాత్రమే ఉంది.

ముఖేష్ సంపాదన గంటకు రూ.90 కోట్లు
50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న ధనవంతులు 4320 మంది వరకు భారత్లో ఉన్నారు. హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గత ఏడాది గంటకు రూ.90 కోట్లు పెరిగింది. 2020లో మొత్తం రూ.2,77,700 కోట్లు పెరిగి రూ.6,58,400 కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద రూ.1620 కోట్ల డాలర్లు పెరిగింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications