HDFC బ్యాంక్ (HDFC బ్యాంక్), HDFC (HDFC) దేశ కార్పొరేట్ చరిత్రలో విలీనం కానున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విలీనానికి మరో 8 నుంచి 10 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి హెచ్డిఎఫ్సి ఛైర్మన్ దీపక్ పరేఖ్ విలీనంపై ఓ ప్రకటన చేశారు. హెచ్డిసిఎఫ్ బ్యాంక్ తన ఫ్లాగ్షిప్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్తో విలీనాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నివేదికల ప్రకారం, షేర్హోల్డర్ల ఆమోదం కోసం హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండూ శుక్రవారం సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో విలీనంపై చర్చించారు. 2022 ఏప్రిల్ 4న విలీనం ప్రకటన రాగా.. ఈ రెండు కంపెనీల విలీనానికి 12 నుంతి 18 నెలల సమయం పట్టవచ్చని తెలిపాయి.

శశిధరన్ జగదీశన్
గత పద్ధతులు, గత ట్రెండ్లను పరిగణనలోకి తీసుకుంటే విలీన తేదీ ప్రకటించడానికి సుమారు 8 నుండి 10 నెలల సమయం పడుతుందని మేము నమ్ముతున్నామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ జగదీశన్ చెప్పారు. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మెరుగైన మూలధన సమృద్ధి నిష్పత్తి ద్వారా, ఈ విలీనం కొత్త సంస్థ మూలధన సమృద్ధి నిష్పత్తిని 0.20 నుండి 0.30 శాతం పెంచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

1.61 లక్షల మంది ఉద్యోగులు
హెచ్డిఎఫ్సికి చెందిన 1.61 లక్షల మంది ఉద్యోగుల జాబితాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు చేరుతారని, కొద్దిమంది మినహా దాదాపు హెచ్డిఎఫ్సిలోని 508 శాఖలు కూడా విలీనం కానున్నాయని జగదీషన్ చెప్పారు. సమావేశాలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నియమించిన గౌతం దోషి అధ్యక్షత వహిస్తారు. శనివారం సాయంత్రంలోగా ఓటింగ్ రిజల్ట్ కాపీని ఎన్సిఎల్టికి అందుబాటులో ఉంచుతామని గౌతమ్ చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications