కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ, ఐటీ సేవల రంగ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మార్చి నుండి దాదాపు 95 శాతం, అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు ఆ తర్వాత క్రమంగా 10 నుండి 20 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. 80 శాతం వరకు ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్నారు. తాజాగా హైసియా సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వంద శాతం వర్క్ ఫ్రమ్ అసాధ్యమని తేలడంతో పాటు, మరింతకాలం ఇంటి నుండి పని పొడిగింపు ఉంటుందని తేలింది.

కొంత మార్పు..
2021 సంవత్సరం ముగిసేవరకు కొంత మార్పు రావొచ్చునని, అప్పటి వరకు కార్యాలయాలకు వెళ్లే ఐటీ, ఐటీ సేవల ఉద్యోగులు తక్కువేనని హైసియా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో చాలామంది ఊళ్ళకు వెళ్లిపోయారు. సొంతూరు లేదా సొంత ఇంటి నుంటి నుండి పని చేస్తున్నారు.
హైదరాబాద్లోని సాఫ్టువేర్, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావడం (రిటర్న్ టు ఆఫీస్) ఈ ఏడాది మధ్య నాటికి కాస్త పుంజుకోవచ్చునని, క్రమంగా ఏడాది చివరికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చునని తెలిపింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. త్వరలో టీకా వస్తుంది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితి నెలకొనడానికి కాస్త సమయం పడుతుందని వెల్లడైంది.

ఇక అందరూ రాకపోవచ్చు
ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీల్లో ఉత్పాదకత ఎక్కువగానే ఉంది. ఇంటి నుంచి పని చేస్తోన్న ఉద్యోగుల్లో యాభై శాతం మంది వరకు సొంతూళ్లకు వెళ్లారు. ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి పని చేస్తున్నందున వర్క్ టు రిటర్న్ కొత్త సమస్య ఉందని, వందశాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడాన్ని ఇక చూడలేకపోవచ్చునని తెలిపింది. చాలామందికి తమ కుటుంబాలతో పాటు నగరానికి రావడం సాధ్యం కాకపోవచ్చునని తెలిపింది.

మరింత కార్యాలయం
63 శాతం కంపెనీలు తమ ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపాయి. కొన్ని పెద్ద కంపెనీల విషయంలో అయితే ఇది వంద శాతం ఉంది. ఉద్యోగులు ఆఫీస్కు రావడం ప్రారంభమైతే కార్యాలయం మరింత అవసరమవుతుందని, ఇది 10 శాతం నుండి 20 శాతం వరకు అదనంగా అవసరం కావొచ్చునని తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications