కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ, ఐటీ సేవల రంగ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మార్చి నుండి దాదాపు 95 శాతం, అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు ఆ తర్వాత క్రమంగా 10 నుండి 20 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. 80 శాతం వరకు ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్నారు. తాజాగా హైసియా సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వంద శాతం వర్క్ ఫ్రమ్ అసాధ్యమని తేలడంతో పాటు, మరింతకాలం ఇంటి నుండి పని పొడిగింపు ఉంటుందని తేలింది.

కొంత మార్పు..
2021 సంవత్సరం ముగిసేవరకు కొంత మార్పు రావొచ్చునని, అప్పటి వరకు కార్యాలయాలకు వెళ్లే ఐటీ, ఐటీ సేవల ఉద్యోగులు తక్కువేనని హైసియా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో చాలామంది ఊళ్ళకు వెళ్లిపోయారు. సొంతూరు లేదా సొంత ఇంటి నుంటి నుండి పని చేస్తున్నారు.
హైదరాబాద్లోని సాఫ్టువేర్, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావడం (రిటర్న్ టు ఆఫీస్) ఈ ఏడాది మధ్య నాటికి కాస్త పుంజుకోవచ్చునని, క్రమంగా ఏడాది చివరికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చునని తెలిపింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. త్వరలో టీకా వస్తుంది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితి నెలకొనడానికి కాస్త సమయం పడుతుందని వెల్లడైంది.

ఇక అందరూ రాకపోవచ్చు
ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీల్లో ఉత్పాదకత ఎక్కువగానే ఉంది. ఇంటి నుంచి పని చేస్తోన్న ఉద్యోగుల్లో యాభై శాతం మంది వరకు సొంతూళ్లకు వెళ్లారు. ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి పని చేస్తున్నందున వర్క్ టు రిటర్న్ కొత్త సమస్య ఉందని, వందశాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడాన్ని ఇక చూడలేకపోవచ్చునని తెలిపింది. చాలామందికి తమ కుటుంబాలతో పాటు నగరానికి రావడం సాధ్యం కాకపోవచ్చునని తెలిపింది.

మరింత కార్యాలయం
63 శాతం కంపెనీలు తమ ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపాయి. కొన్ని పెద్ద కంపెనీల విషయంలో అయితే ఇది వంద శాతం ఉంది. ఉద్యోగులు ఆఫీస్కు రావడం ప్రారంభమైతే కార్యాలయం మరింత అవసరమవుతుందని, ఇది 10 శాతం నుండి 20 శాతం వరకు అదనంగా అవసరం కావొచ్చునని తెలిపింది.
More From GoodReturns

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications