కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ కంపెనీలలో వేతన కోతలు కొనసాగుతున్నాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉన్నతాధికారులకు కూడా శాలరీలో కోత తప్పలేదు. కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ వేతన ప్యాకేజీ గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 16 శాతం తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.16.02 కోట్ల పారితోషికం అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ.13.3 కోట్లకు తగ్గింది.

2019-20లో సీఈవో ఆదాయం ఇలా..
సీఈవో రాజేష్ గోపినాథన్ వేతన ప్యాకేజీ 16 శాతం తగ్గినట్లు వార్షిక నివేదికలో టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం 2019-20లో గోపినాథన్ వేతనంగా రూ.1.35 కోట్లు, ప్రోత్సాహకాలు రూ.1.29 కోట్లు, కమీషన్ రూ.10 కోట్లు, అలవెన్సులు రూ.72.82 లక్షలు తీసుకున్నారు.
అంతకుముందు (2018-19) ఆర్థిక సంవత్సరంలో రాజేష్ గోపినాథన్ వేతనంగా రూ.1.15 కోట్లు, ప్రోత్సాహకాలు రూ.1.26 కోట్లు, కమీషన్ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60.36 లక్షలు తీసుకున్నారు.

వీరి శాలరీ కూడా తగ్గింది
టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గణపతి సుబ్రహ్మణియన్ వేతన ప్యాకేజీ రూ.11.61 కోట్ల నుండి రూ.12.9 శాతం తగ్గి రూ.10.1 కోట్లకు పరిమితం అయింది.
టీసీఎస్ ముఖ్య ఆర్థిక అధికారి రామకృష్ణన్ వేతనం రూ.4.13 కోట్ల నుండి 3.63 శాతం తగ్గి రూ.3.98 కోట్ల ప్యాకేజీ పొందారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో కరోనా కారణంగా వేతనాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది.
టీసీఎస్ డైరెక్టర్ల వేతనం కూడా భారీగా తగ్గింది. ఇండిపెండెంట్ అండ్ ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వేతనం రూ.12.43 కోట్ల నుండి రూ.9.20 కోట్లకు తగ్గింది.

గత ఆర్థిక సంవత్సరంలో పెంపు
2018-19లో నాన్-మేనేజరల్ స్టాప్కు సగటున 6 శాతం వేతనం పెంచారు. ఇండియా బయటి ఉద్యోగులకు దాదాపు 2 శాతం నుండి 6 శాతం పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ఉన్నతాధికారుల వేతనాలు భారీగా తగ్గాయి.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు కూడా వచ్చే కొద్ది నెలలు సవాళ్లు ఎదుర్కొంటాయని, టీసీఎస్ ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. తిరోగమనంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. కరోనా తర్వాత కొత్త పరిస్థితులను కంపెనీలు ఆకళింపు చేసుకోవడంలో టెక్నాలజీది ముఖ్య పాత్ర అన్నారు.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications