కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ కంపెనీలలో వేతన కోతలు కొనసాగుతున్నాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉన్నతాధికారులకు కూడా శాలరీలో కోత తప్పలేదు. కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ వేతన ప్యాకేజీ గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 16 శాతం తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.16.02 కోట్ల పారితోషికం అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ.13.3 కోట్లకు తగ్గింది.

2019-20లో సీఈవో ఆదాయం ఇలా..
సీఈవో రాజేష్ గోపినాథన్ వేతన ప్యాకేజీ 16 శాతం తగ్గినట్లు వార్షిక నివేదికలో టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం 2019-20లో గోపినాథన్ వేతనంగా రూ.1.35 కోట్లు, ప్రోత్సాహకాలు రూ.1.29 కోట్లు, కమీషన్ రూ.10 కోట్లు, అలవెన్సులు రూ.72.82 లక్షలు తీసుకున్నారు.
అంతకుముందు (2018-19) ఆర్థిక సంవత్సరంలో రాజేష్ గోపినాథన్ వేతనంగా రూ.1.15 కోట్లు, ప్రోత్సాహకాలు రూ.1.26 కోట్లు, కమీషన్ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60.36 లక్షలు తీసుకున్నారు.

వీరి శాలరీ కూడా తగ్గింది
టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గణపతి సుబ్రహ్మణియన్ వేతన ప్యాకేజీ రూ.11.61 కోట్ల నుండి రూ.12.9 శాతం తగ్గి రూ.10.1 కోట్లకు పరిమితం అయింది.
టీసీఎస్ ముఖ్య ఆర్థిక అధికారి రామకృష్ణన్ వేతనం రూ.4.13 కోట్ల నుండి 3.63 శాతం తగ్గి రూ.3.98 కోట్ల ప్యాకేజీ పొందారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో కరోనా కారణంగా వేతనాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది.
టీసీఎస్ డైరెక్టర్ల వేతనం కూడా భారీగా తగ్గింది. ఇండిపెండెంట్ అండ్ ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వేతనం రూ.12.43 కోట్ల నుండి రూ.9.20 కోట్లకు తగ్గింది.

గత ఆర్థిక సంవత్సరంలో పెంపు
2018-19లో నాన్-మేనేజరల్ స్టాప్కు సగటున 6 శాతం వేతనం పెంచారు. ఇండియా బయటి ఉద్యోగులకు దాదాపు 2 శాతం నుండి 6 శాతం పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ఉన్నతాధికారుల వేతనాలు భారీగా తగ్గాయి.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు కూడా వచ్చే కొద్ది నెలలు సవాళ్లు ఎదుర్కొంటాయని, టీసీఎస్ ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. తిరోగమనంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. కరోనా తర్వాత కొత్త పరిస్థితులను కంపెనీలు ఆకళింపు చేసుకోవడంలో టెక్నాలజీది ముఖ్య పాత్ర అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications