ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు క్రమంగా షిఫ్ట్ చేస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో క్రమంగా ఉద్యోగుల సందడి మొదలవుతోంది. అయితే ఇది పాక్షికమే. వర్క్ ఫ్రమ్ ఆఫీస్తో పాటు ఐటీ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లకు పైగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. కరోనా ముప్పు తగ్గిపోవడంతో ఇప్పుడు గతంలో మాదిరి కార్యాలయాల నుండి పనికి సిద్ధమయ్యారు.
బెంగళూరు, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో వివిధ రంగాల్లోని కంపెనీలు.. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్లకు పిలిపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతూ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఆఫీస్ల నుండి పని చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చునని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు అనుసరించే అవకాశముంది. వారంలో కొన్ని రోజులు ఇంటి నుండి, కొన్ని రోజులు ఆఫీస్ నుండి పని చేయించే విధానంపై దృష్టి సారించాయి. హైదరాబాద్లో లక్షలమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలామంది ఉద్యోగులు ఇప్పటికే తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లారు. కంపెనీలు వెనక్కి పిలుస్తుండటంతో చాలామంది హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలి వస్తున్నారు.
టీసీఎస్, హెచ్సీఎల్ హైబ్రిడ్ విధానం వైపు మొగ్గు చూపుతోంది. ఇన్ఫోసిస్ దశలవారీగా ఉద్యోగులను ఆఫీస్కు పిలిపించే ప్లాన్ చేస్తోంది. కాగ్నిజెంట్, విప్రో వంటి సంస్థలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉద్యోగుల సంఖ్య రానున్న రెండే నెలల కాలంలో 25 శాతానికి, ఆగస్ట్ నాటికి 50 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications