TCS News: ఐటీ పరిశ్రమలో దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న 6 లక్షలకు పైగా టెక్కీలకు వేరియబుల్ పరిహారాన్ని 100% చెల్లిస్తామని పేర్కొంది.

డబ్బులు ఎప్పుడొస్తాయంటే..
టాటా గ్రూప్ కంపెనీ C3A, C3B, C4, సమానమైన గ్రేడ్ల కోసం వేరియబుల్ చెల్లింపును ఒక నెల ఆలస్యం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే జూలైలో చెల్లించాల్సిన ఈ వేరియబుల్ సొమ్మును ఆగస్ట్-చివరి నాటికి చెల్లించటం జరుగుతుందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. అసిస్టెంట్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ స్థాయి ఉద్యోగులకు దీనికి సంబంధించి కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఈ వివరాలు తెలిపినట్లు సమాచారం.

70 శాతానికి తగ్గింపు..
దేశంలోని WIPRO, INFOSYS వంటి ఇతర IT కంపెనీలు వేరియబుల్ వేతనాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు తెలిపింది. ముఖ్యంగా కార్యకలాపాల మార్జిన్లో క్షీణత కనిపించిన తర్వాత విప్రో తన ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటన చేసింది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేరియబుల్ పేలో సగటున 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతికతలో పెట్టుబడులు, ఉద్యోగుల కొరత, మార్జిన్ ఒత్తిడి వంటి కారణాల వల్ల విప్రో ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని ఆలస్యం చేసింది.

వేరియబుల్ పే అంటే ఏమిటి?
వేరియబుల్ పే అనేది పనితీరు, సంస్థ పెరుగుదల పురోగతికి సహకారం ఆధారంగా ఉద్యోగులకు యజమాని చెల్లించే పరిహారం. ఇది ఉద్యోగులకు మూడునెలలకు ఒకసారి కంపెనీలు చెల్లిస్తుంటాయి. ఉద్యోగులు జీతంలో ఇవి కూడా ప్రధాన భాగంగా ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications