కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో జీడీపీ 23.9 శాతం మేర ప్రతికూలత నమోదు చేసింది. రానున్న రెండు క్వార్టర్లలో కాస్త పుంజుకున్నప్పటికీ మైనస్లలోనే నమోదు కావొచ్చునని, నాలుగో క్వార్టర్ నాటికి కాస్త పాజిటివ్ కనిపించవచ్చునని పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా భారత జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు ప్రతికూలత ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ ఓ శుభవార్త చెప్పారు.

సానుకూల వృద్ధి ఉండవచ్చు
'ఇండియాస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఆప్షన్స్-ఎమర్జింగ్ ఫ్రమ్ ది పాండమిక్స్ షాడో' అనే అంశంపై ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్తో కలిసి రంగరాజన్ ఓ పత్రాన్ని రూపొందించారు. ఇందులో కొంత ఆశావహ దృక్పథం కనిపించింది. కరోనా ప్రభావం ఉన్ప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ కొంత సానుకూల ఆర్థిక వృద్ధినినమోదు చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జీడీపీ తగ్గుతుందని భావిస్తున్నాయని, దీనిని ప్రపంచ బ్యాంకు 3.2 శాతంగా, ఎస్బీఐ 6.8 శాతంగా అంచనా వేస్తున్నాయని, కానీ జీడీపీ అంతకంటే ఎక్కువే ఉండవచ్చునని విశ్వసించేందుకు పలు కారణాలు ఉన్నాయని తెలిపారు.

కాస్త సానుకూలం.. కారణాలివే..
వ్యవసాయం, అనుబంధ రంగాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ సర్వీస్, ఇతర సేవలు, నిత్యావసర వస్తువులు, సేవలు వంటివి మొదటి క్వార్టర్లో పూర్తిగా పని చేశాయని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షఇంచడంలో క్రియాశీలకంగా ఉన్నాయన్నారు. ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, పైరంగాలు కలిపి మొత్తం ఉత్పాదనలో 40 శాతం నుండి 50 శాతం వరకు ఉంటాయని గుర్తు చేశారు. ఇవి మొదటి త్రైమాసికం నుండి పని చేస్తున్నాయని, కాబట్టి 2020-21 పూర్తిస్థాయి ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం సాధారణ లేదా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పెట్టుబడుల ఆకర్షణకు..
కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో కార్పోరేట్ పన్నులను తగ్గించిందని గుర్తు చేశారు. తద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారన్నారు. ఈ కారణాలన్నింటితో చిన్న సానుకూల వృద్ధిని తోసిపుచ్చలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఖర్చులు పెరగడం అనివార్యమని, అలాగే అప్పులు పెరగడం కూడా తప్పదన్నారు. మోనెటైజేషన్కు పరిమితి ఉందనే విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ధీటుగా ఎదుర్కోవాలని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications