ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపు ఊగిసలాటలో కనిపించాయి. చివరలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 812 పాయింట్లు(2.09 శాతం) నష్టపోయి 38,034.14 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు (2.21 శాతం) నష్టపోయి 11,250.55 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 34 పాయింట్లతో 38వేల దిగువ ప్రమాదాన్ని తప్పించుకుంది. ఇటీవల 39వేలు దాటిన సెన్సెక్స్ 38,000 స్థాయికి దిగి వచ్చింది. 11,500కు పైగా ఉన్న నిఫ్టీ ఇప్పుడు 11,300 కంటే దిగువకు వచ్చింది.

టెలికం, రియాల్టీ కుప్పకూలాయి
అన్ని రంగాలు కూడా భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ టెలికం, రియాల్టీ షేర్లు 6 శాతం మేర కుప్పకూలాయి. మెటల్, ఆటో షేర్లు 5 శాతం మేర నష్టపోయింది. టాప్ గెయినర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రమే ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిండాల్కో, జేఎస్డబ్ల్యు స్టీల్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

మార్కెట్ నష్టాలకు కారణం..
వ్యవసాయ బిల్లు పైన రాజ్యసభలో కేంద్రప్రభుత్వానికి సవాళ్లు ఎదురు అవుతున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. యూరోపియన్ దేశాల్లో తిరిగి తలెత్తుతున్న కరోనా వైరస్ కేసులు, దేశంలోను పెరుగుతున్న కేసులు వంటి వివిధ కారణాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. రెండోసారి లాక్ డౌన్ విధించే యోచన ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి తోడు గ్లోబల్ బ్యాంకుల్లో అవకతవకలు జరిగాయని వెలువడిన ఆరోపణలు ఇన్వెస్టర్లలో ఆందోళనలను మరింతగా పెంచాయి.

దిగ్గజ కంపెనీలు బేజారు
ముఖ్యంగా ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రధాన షేర్లపై అమ్మకాల ఒత్తిడి ప్రభావం చూపింది. దీంతో మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టపోయాయి. అయితే ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్స్ లిమిటెడ్ మాత్రం భారీగా దూసుకెళ్ళింది. షేర్ ధర రూ.350 వద్ద ప్రారంభం కాగా, రూ.650 వద్ద ముగిసింది. 85 శాతం లాభంతో క్లోజ్ అయింది. రిలయన్స్ షేర్ ధర 2.42 శాతం, ఎయిర్టెల్ షేర్ ధర 5.46 శాతం మేర, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ ధర 8.52 శాతం మేర నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లు 0.7 శాతం మేర నీరసించాయి. మిగతా షేర్లు 2.5 శాతం నుండి 6 శాతం మేర పతనమయ్యాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications