పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత్ స్టాక్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మధ్య కాలంలో ఐటీ రంగం రక్తపాతాన్నే చూసిందని చెప్పవచ్చు. తాజాగా ప్రపంచ చిప్ దిగ్గజం NVIDIA ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చేసిన తాజా ప్రకటనలు భారతీయ ఐటీ స్టాక్లపై ప్రభావం చూపాయి. ఎన్విడియా తన వార్షిక GTC డెవలపర్ కాన్ఫరెన్స్లో 2027 నాటికి AI చిప్ల ద్వారా వచ్చే ఆదాయం కనీసం 1 ట్రిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని ప్రకటించింది.
డిసెంబర్లో 17 బిలియన్ డాలర్ల లైసెన్స్ పొందిన చిప్ స్టార్టప్ Groq టెక్నాలజీతో కలసి కొత్త సెంట్రల్ ప్రాసెసర్, AI సిస్టమ్ను CEO జెన్సన్ హువాంగ్ ఆవిష్కరించారు. హువాంగ్ మాట్లాడుతూ..అంచనాల కీలక మలుపు వచ్చేసింది. డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ఈ ప్రకటనలతో వాల్ స్ట్రీట్ సూచీలు లాభపడ్డప్పటికీ.. భారతీయ ఐటీ స్టాక్లు మంగళవారం పెద్ద తగ్గింపునకు లోనయ్యాయి. Infosys, Wipro, Coforge, ఎంఫసిస్, LTI, Mindtree, Persistent Systems షేర్లు 2 నుంచి 6 శాతం వరకు పడిపోయాయి.

కొఫోర్జ్ షేర్లు సుమారు 6 శాతం క్షీణించగా.. ఈ స్టాక్లు కొన్ని కొత్త 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు సుమారు 2% తగ్గి, Tech Mahindra 1 శాతానికి పైగా పడిపోయింది. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2% పైగా క్షీణించి NSEలో అగ్ర రంగాల నష్టాల్లో ఒకటిగా నిలిచింది.ఇలాంటి తగ్గింపుకు ప్రధాన కారణం AI ఆధారిత ఆందోళనలు అని చెప్పవచ్చు. ఆంత్రోపిక్ వంటి సంస్థలు ఈ ఏడాది ప్రారంభం నుంచి AI సాధనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి.
పెట్టుబడిదారులు భావిస్తున్నట్లుగా, AI స్వీకరణ వలన కొన్ని సబ్సెక్టర్లలో ఉద్యోగాలపై ప్రభావం ఉండవచ్చని, కంపెనీలు సిబ్బందిని తగ్గించవలసి రావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఈ వారం చివర్లో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ FOMC సమావేశ ఫలితాలు కూడా భారతీయ ఐటీ స్టాక్ల పట్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని వారు తెలిపారు.
నువామా విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన IT స్టాక్ల తీవ్రమైన దిద్దుబాటు, ఇప్పుడు వాల్యుయేషన్లను ఆకర్షణీయంగా మార్చింది. కంపెనీలకు AI వల్ల ఉనికికి ముప్పు ఉండదని నువామా భావిస్తుంది. AI పైన ఆధారపడిన ప్లగ్-ఇన్ సిస్టమ్లు, సాఫ్ట్వేర్ ఇన్పుట్-అవుట్పుట్లు అనుకూలీకరణ అవసరాలను పూర్తి చేయగల సిస్టమ్ ఇంటిగ్రేటర్ అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది అని కూడా ఇది పేర్కొంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ఎన్విడియా ప్రకటనల ప్రభావంతో, భారతీయ ఐటీ స్టాక్లు భారీగా క్షీణించగా, AI ఆధారిత భవిష్యత్తు, FOMC సమావేశాల ఊహ,సిబ్బంది తగ్గింపు ఆందోళనలు పెట్టుబడిదారుల ఆందోళనలను పెంచాయని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

Paskistan: పాకిస్థాన్కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications