కరోనా మహమ్మారి కారణంగా భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లు బుధవారం ఊగిసలాటలో ప్రారంభమై.. ఆ తర్వాత మధ్యాహ్నానికి భారీ నష్టాల్లోకి వెళ్లాయి. కరోనా కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు డైలమాలో ఉన్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 501.46 పాయింట్లు (1.64%) నష్టపోయి 31,080.55 వద్ద, నిఫ్టీ 148.70 పాయింట్లు (1.66%) నష్టపోయి 9115.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 8,800 సమీపంలో నిలిచింది. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,461.45 (4.78%) పాయింట్లు నష్టపోయి 29,117.64 వద్ద, నిఫ్టీ 8,600 పాయింట్లకు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది.
మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, వేదాంత, విప్రో, సన్ ఫార్మా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండి బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, గెయిల్ ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్యూ అన్నీ నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి.

నిన్నటి వరకు భారీ లాభాలు చూసిన యస్ బ్యాంకు షేర్లు బుధవారం కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రం మారటోరియం ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓ సమయంలో దాదాపు 50 శాతం పెరిగి రూ.87.95కి చేరుకుంది. మధ్యాహ్నానికి షేర్ 5.46 శాతం పెరిగి రూ.62కు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 40 శాతం మేర నష్టపోయాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications