కరోనా మహమ్మారి కారణంగా భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లు బుధవారం ఊగిసలాటలో ప్రారంభమై.. ఆ తర్వాత మధ్యాహ్నానికి భారీ నష్టాల్లోకి వెళ్లాయి. కరోనా కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు డైలమాలో ఉన్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 501.46 పాయింట్లు (1.64%) నష్టపోయి 31,080.55 వద్ద, నిఫ్టీ 148.70 పాయింట్లు (1.66%) నష్టపోయి 9115.75 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 8,800 సమీపంలో నిలిచింది. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,461.45 (4.78%) పాయింట్లు నష్టపోయి 29,117.64 వద్ద, నిఫ్టీ 8,600 పాయింట్లకు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది.
మధ్యాహ్నం గం.11.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, వేదాంత, విప్రో, సన్ ఫార్మా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండి బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, గెయిల్ ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్యూ అన్నీ నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి.

నిన్నటి వరకు భారీ లాభాలు చూసిన యస్ బ్యాంకు షేర్లు బుధవారం కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రం మారటోరియం ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓ సమయంలో దాదాపు 50 శాతం పెరిగి రూ.87.95కి చేరుకుంది. మధ్యాహ్నానికి షేర్ 5.46 శాతం పెరిగి రూ.62కు చేరుకుంది. వొడాఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 40 శాతం మేర నష్టపోయాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications