ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (ఆగస్ట్ 27) లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీగా లాభపడిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రారంభ లాభాలను నిలుపుకోలేక పోయింది. ఉదయం సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభాల్లో కనిపించాయి. చివరకు అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 40 పాయింట్లు(0.10%) లాభపడి 39,113.47 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు(0.084) లాభపడి 11,559.25 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం లాభాల్లో ముగిసింది. రంగాలవారగా చూస్తే బీఎస్ఈ ఎనర్జీ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ఆయిల్, గ్యాస్, యుటిలిటీస్, టెలికం, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ రియాల్టీ మాత్రమే భారీ లాభాల్లో క్లోజ్ అయింది.

రియాల్టీ జూమ్.. ఎందుకంటే?
నేటి మార్కెట్లో రియాల్టీ రంగం భారీ లాభాల్లో ముగిసింది. రియాల్టీ ఏకంగా 6.63 శాతం లాభపడింది. కరోనా కారణంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న రియాల్టీ రంగానికి ఊతమిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. అలాగే 2021 జనవరి 1 నుండి మార్చి 31 వరకు 3 శాతం స్టాంప్ డ్యూటీని విధిస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో స్టాంప్ డ్యూటీని 4 శాతం నుండి 1 శాతానికి తగ్గించింది. 2021 జనవరి నుండి మార్చి మధ్యలో ఇది 2 శాతంగా ఉండనుంది. దీంతో రియాల్టీ కౌంటర్లకు డిమాండ్ ఏర్పడింది.

రిలయన్స్, ప్రయివేటు బ్యాంకుల ప్రభావం
తొలుత మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా రిలయన్స్ దాదాపు 1.4 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ 0.4 శాతం మేర వెనక్కి లాగాయి. ఆటో స్టాక్స్ వరుసగా 5వ రోజు లాభాల్లో ముగిశాయి. పన్ను తగ్గింపు ఆశలతో ఈ స్టాక్స్ లాభాలు చూస్తున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, రిలయన్స్, కొటక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

52 వారాల గరిష్టానికి
దాదాపు 187 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇందులో ఏపీఎల్ అపోలో, అతుల్, డిక్సాన్ టెక్, టాటా ఎలెక్సీ, జీఎంఆర్ ఇన్ఫ్రా, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్ఫోసిస్ కూడా నష్టాల్లో ముగిశాయి.

భారీ లాభాల్లో రూపాయి
డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు 49 పైసలు లాభపడి 73.81 వద్ద క్లోజ్ అయింది. మార్చి 11వ తేదీ తర్వాత ఇది రికార్డ్ క్లోజింగ్. 73.80 నుండి 74.36 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 73.81 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ నెలలో రూపాయి ఆల్ టైమ్ కనిష్టం 76.91 నమోదు చేసింది. ఈ రికార్డ్ నుండి ఈ కాలంలో 3.43 శాతం లాభపడింది. అయితే ఈ ఏడాది ప్రారంభ ధరతో ఇప్పటికీ 4.03 క్షీణతలో ఉంది. ఇక, క్రూడాయిల్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications