సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం కొత్త చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విధానం ఎలా పనిచేస్తోందనే వివరాలను సెబీ నిన్న వెల్లడించింది. పెట్టుబడిదారుల నిధులను బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా కొత్త విధానం అడ్డుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే T+1 సెటిల్మెంట్ కు మారగా.. దేశీయ స్టాక్ మార్కెట్ను ప్రపంచంలో మేటిగా తీర్చిదిద్దడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యూపీఐకి జై
ఆర్బీఐ ఆమోదించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ను ఈ విధానంలో విరివిగా వినియోగించుకోనున్నట్లు సెబీ పేర్కొంది. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం కోసం ఖాతాదారులు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నిధులను ముందుగా బ్రోకర్ కు బదిలీ చేస్తున్నారు. దీనికి బదులుగా స్వయంగా క్లియరింగ్ సంస్థకే బదలాయించే వీలు కొత్త విధానం ద్వారా కలగనుందని చెప్పింది. ఏవైనా సూచనలుంటే తెలపాలంటూ ప్రజాభిప్రాయం కోరింది.

నేరుగా క్లియరింగ్
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. బ్రోకర్ల వద్ద 30,000 కోట్ల రూపాయలకు పైగా వినియోగదారుల నిధులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిపాదిత వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. బ్రోకర్ కు చెల్లించేందుకు బదులుగా పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలోనే అవి బ్లాక్ చేయబడతాయి. అక్కడి నుంచి నేరుగా క్లియరింగ్ కార్పొరేషన్కు బదిలీ అవుతాయి. ఈ విధానాన్ని ఏఎస్బీఏ అని పిలుస్తారు.

వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యం..
'స్టాక్ మార్కెట్ బ్రోకర్లు డీఫాల్ట్ కావడానికి విభిన్న కారణాలుండవచ్చు. వాటిలో ప్రధానమైనది ఖాతాదారుల నిధులు, సెక్యూరిటీలు దుర్వినియోగం చేయడం. తద్వారా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు నష్టం కలగడమే కాకుండా మార్కెట్పై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ తరహా సమస్యలు పరిష్కరించడానికి కొత్త వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగించి పరిస్థితికి అనుగుణంగా ముందస్తు హెచ్చరికలు జారీచేసే అవకాశం కలుగుతుంది' అని సెబీ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications