రీట్స్, ఇన్విట్స్ నిధుల సమీకరణ నిబంధనల్లో సడలింపులు
స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్ట్స్(REITs), మౌలిక పెట్టుబడుల ట్రస్ట్ (InvITs)లకు నిధుల సమీకరణను మరింత సులువు చేసేలా నిబంధనలను సడలించింది సెబి(సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI). ఇంతకుముందు ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మార్గంలో ఓసారి నిధులు సమీకరించాక, ఆ తేదీ నుండి మరో ఆరు నెలల వరకు నిధులు సమీకరించకూడదనే నిబంధన ఉంది.
ఇప్పుడు దీనిని రెండు వారాలకు తగ్గించింది. సెబి ఈ పరిమితిని తగ్గించడం ఎంతో ప్రయోజనకరం. అలాగే ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ రైట్స్, ఇన్విట్స్ యూనిట్ ధరలకు సంబంధించి కూడా సెబి మార్పులు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నమోదిత రైట్స్, ఇన్విట్స్కు నిధులు సమీకరణకు సంబంధించి కొన్ని సడలింపులను ఇచ్చామని సెబి తన సర్క్యులర్లో తెలిపింది.
మన దేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ని అదుపు చేసే సంస్థగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ అఫ్ ఇండియా-SEBI... సెబీ చట్టం 1992 ద్వారా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాణిజ్య ప్రాంతం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో ఉంది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్లలో ఉఫశాఖలు ఉన్నాయి.