For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో SBI యోనో మర్చంట్ యాప్: ఒక బటన్ క్లిక్ చేస్తే...

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్వరలో యోనో మర్చంట్ యాప్‌ను తీసుకురానుంది. దీనిని SBI అనుబంధ సంస్థ ఎస్బీఐ పేమెంట్స్ తీసుకురానుంది. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలో డిజిటలైజేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో PoS మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు, కొనుగోలుదారులకు ఊతమిచ్చేందుకు తీసుకు వస్తున్నారు.

SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..

యోనో మర్చంట్ యాప్ పేరుతో...

యోనో మర్చంట్ యాప్ పేరుతో...

ఎస్బీఐ పేమెంట్స్... యోనో మర్చంట్ యాప్ పేరుతో ఈ సేవలను విడుదల చేయాలని భావిస్తోంది. మొబైల్ ఆధారిత టెక్నాలజీతో అతి తక్కువ విలువ కలిగిన డిజిటల్ చెల్లింపులన కోసం వ్యాపారుల్ని సన్నద్ధం చేసే లక్ష్యంలో భాగంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. యోనో మర్చంట్ యాప్‌తో దేశంలో మర్చంట్ చెల్లింపుల డిజిటైజేషన్‌ను విస్తరించే అవకాశం లభిస్తుందని తెలిపింది. వచ్చే రెండేళ్లలో రిటైల్, ఎంటర్‌ప్రైజ్ విభాగంలో దేశవ్యాప్తంగా రెండుకోట్ల మంది వ్యాపారుల్ని ఈ యాప్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తృతీయ శ్రేణి పట్టణాల్లో...

తృతీయ శ్రేణి పట్టణాల్లో...

తృతీయశ్రేణి పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఎస్పీఐ తెలిపింది. గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ సంస్థ వీసాతో కలిసి యోనో ఎస్పీఐ మర్చంట్ POS (పాయింట్ ఆఫ్ సేల్‌)గా వ్యవహరిస్తుందని ఎస్బీఐ తెలిపింది. ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (PIDF)లో భాగంగా దీనిని తీసుకు వస్తున్నట్లు తెలిపింది.

ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా..

ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా..

వచ్చే రెండేళ్లలో లాయాల్టీ, జీఎస్టీ ఇన్వాయిసింగ్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ వంటి సేవలను యాక్సెస్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్స్‌ను PoS డివైజ్‌లోకి అప్-గ్రేడ్ చేయడం ద్వారా లక్షలాది మంది వ్యాపారులను డిజిటలైజ్ చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇతర బ్యాంకింగ్ ఉత్పత్తులను పొందవచ్చు.

English summary

త్వరలో SBI యోనో మర్చంట్ యాప్: ఒక బటన్ క్లిక్ చేస్తే... | SBI to launch YONO Merchant app for low cost payments

SBI Payments, a subsidiary of India's largest lender State Bank of India (SBI), to launch YONO Merchant app to provide low-cost digital payments infrastructure to merchants. The company aims to boost digital payments acceptance infrastructure in tier 3, 4 as well as North Eastern cities. This would enable millions of merchants to accept digital payments through mobile led technology, SBI said in a press release.
Story first published: Sunday, February 21, 2021, 9:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X