బాలికల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన సుకన్య సమృద్ధి యోజన(SSY)కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య 40 శాతానికి పైనే వృద్ధి నమోదు చేసింది. 2020 మే నెల చివరి నాటికి ఈ స్కీంలో రూ.75,522 కోట్ల పెట్టుబడి ఉండగా, 2021 మే నెల నాటికి ఈ మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మేరకు నేషనల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ గణాంకాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ స్కీంలో 7.6 శాతం వడ్డీ ఉంది. స్మాల్ సేవింగ్స్ స్కీంలలో ఇది గరిష్ఠ వడ్డీ రేటు. 2015 జనవరిలో తీసుకు వచ్చిన ఈ పథకంలో పదేళ్ల లోపు వయసున్న బాలికల పేరుతో ఖాతా ప్రారంభించే అవకాశముంది. నెల నెలా లేదా ఏడాదికి ఓసారి ఈ ఖాతాలో సొమ్ము జమ చేయొచ్చు. గరిష్ఠంగా పదిహేనేళ్ల పాటు పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంది. అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చాక నిబంధనల మేరకు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన (SSY) ప్రభుత్వ ప్రత్యేక పెట్టుబడి పథకం. ఇది ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకం. దీనికి EEE వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద SSY పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications