India-Russia: భారత్ మాస్టర్ ప్లాన్.. ఆశ్చర్యపోయిన రష్యా .. సూపర్ ఐడియా వేసిన ఇండియా..!
India-Russia: ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య మార్కెట్ కూడా అధిక దారుణంగా ప్రభావితం అవుతోంది. దీనిని ఎదుర్కోవడానికి.. భారత్ అనేక సంక్షోభాల మధ్య రష్యా ముడి చమురును డిస్కౌంట్ రేటుకే కొనుగోలు చేస్తోంది. కరోనా తరువాత దేశంలో తయారీ, వ్యాపారం ఊపందుకోవటంతో ఇంధనానికి డిమాండ్ భారీగానే పెరిగింది.
UAE నుంచి క్రూడ్ కొనుగోళ్లు..
భారతదేశం తన చిరకాల మిత్రదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి క్రూడ్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. రష్యా నుంచి తగ్గింపు ధరలకు క్రూడ్ కొనుగోలు చేస్తోంది. ఇది దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరల పరుగుకు కళ్లెం వేస్తోంది.
ఇండియా కొత్త వ్యూహం..
ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ ద్వారా రష్యా ముడి చమురు దిగుమతిని పెంచడానికి భారత ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది రష్యాను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
వివిధ మార్గాల్లో చమురు..
భారత్.. రష్యా ప్రభుత్వం నుంచి ముడి చమురును అనేక మార్గాల్లో కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగా రష్యన్ మార్కెట్లో కొత్త అవకాశాలు ఉద్భవించాయి. ప్రస్తుతం భారత్ వాటిని ఉపయోగిస్తోంది. మరో పక్క ఆర్థిక మాంద్యం, వాణిజ్యం క్షీణించడంతో, రష్యాలోని చాలా మంది చిన్నపెద్ద వ్యాపారులు కొత్త కస్టమర్ల కోసం చూస్తున్నారు.
యుద్ధం నుంచి అవకాశం..
కష్ట సమయాల్లోనే ఒక దేశంలో అనేక వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టిన అనేక కంపెనీలు ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలుగా నిలిచాయి.
ఇండియన్ ఆయిల్..
రష్యాలో గిట్టుబాటు ధరకు క్రూడ్ ఆయిల్ విక్రయించే పలువురు వ్యాపారులు భారత్ కు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఆయిల్ చిన్న వ్యాపారుల నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.
రోస్నెఫ్ట్ నుంచి కొనుగోళ్లు..
రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ నుంచి భారత ప్రభుత్వం నేరుగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ప్రస్తుతం వెల్ బ్రెడ్, మాంట్ ఫోర్ట్, కోరల్ ఎనర్జీ, ఎవరెస్ట్ ఎనర్జీ వంటి కంపెనీలు భారత్ కు ముడి చమురుపై ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులు రష్యాకే ఆశ్చర్యం కలిగిస్తోంది.