ఉద్యోగుల భవిష్యనిధి (EPFO) పెన్షన్ స్కీమ్ కింద సబ్స్క్రైబర్లు చెల్లించే రూ.1000 చాలా తక్కువ అని పార్లమెంటు కమిటీ నిర్ణయించింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకు వెళ్లడం అవసరమని భావించింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని భావించింది. దీంతో ఏడు కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుంది. 2022-23 గ్రాంట్స్ డిమాండ్పై పార్లమెంటులో సమర్పించిన నివేదికలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించిన రూ.1000 నెలవారీ పెన్షన్ ఇప్పుడు తక్కువగా ఉందని పేర్కొంది.
EPFOపై ప్రభావం చూపడంతో పాటు ఆధిక సాధికారత పర్యవేక్షణ సిఫార్స్ చేసిన విధంగా తగిన బడ్జెట్ మద్దతు పొందడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఈ విషయ ప్రస్తావన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు తప్పనిసరి అని ప్యానెల్ పేర్కొంది. సభ్యుడి పెన్షన్ సహేతుకమైన మేరకు పెంచేలా వాస్తవికతను అంచనా వేయడానికి సంప్రదింపులు అవసరమని తెలిపింది.

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 పూర్తి మూల్యాంకనం, సమీక్ష కోసం 2018లో మంత్రిత్వ శాఖ ఒక హై-ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన నివేదికలో మెంబర్/విడో/విడోవర్ పెన్షనర్కు చెల్లించాల్సిన కనీస నెలవారీ పెన్షన్ను రూ.2000కు పెంచాలని సిఫార్స్ చేసింది. దీని కోసం వార్షిక బడ్జెట్ కేటాయింపులు చేయాలని అభిప్రాయపడింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications