న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య అని, దీనికి ధరలు తగ్గించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆమె స్పష్టం చేశారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సిన అంశాలు అన్నారు. ఇది ధర్మసంకమైన అంశమని, ధరలు తగ్గించడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు.
'వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ధర్మ్ సంకటమైన పరిస్థితి'. కస్టమర్లకు తుది ధర లేదా రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాల'ని వ్యాఖ్యానించారు.

అందుకే పెరుగుతున్నాయి
చమురు ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని నిర్మల చెప్పారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్ వంటి ఖర్చులను బట్టి ఈ కంపెనీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు. అమె చెన్నై సిటిజన్ షిప్ ఫోరం సదస్సులో మాట్లాడారు. నవంబర్ నెల నుండి క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం వంటి వివిధ కారణాలతో ధరలు పెరుగుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రాలతో సంప్రదింపులు
నేను ఒక్క కేంద్రమంత్రినే ఈ ధరలను తగ్గిస్తానని చెప్పలేనని ఎక్సైజ్ డ్యూటీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు కూడా కలిసి రావాలని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధరల పెరుగుదలపై చర్చించాలన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు మోడీ ప్రభుత్వం సై అంటోంది. కానీ కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదు. దీనిపై నిర్మల మాట్లాడుతూ... దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశం రాష్ట్రాలతో సంప్రదింపుల ద్వారా, జీఎస్టీలో చర్చించడం ద్వారా తీసుకునే నిర్ణయం అన్నారు.

అంతా ఒక ధర
రాష్ట్రాలు జీఎస్టీకి అంగీకరిస్తే దేశమంతా ఒకే ధర ఉంటుందని, వీటిపై వచ్చే ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవచ్చునని చెప్పారు. చమురు పైన కేంద్రం సొంత పన్ను వాటా, రాష్ట్రాలు సొంత పన్ను వాటాలు కలిగి ఉండటం కంటే జీఎస్టీలోకి తేవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ హేతుబద్దీకరణ గురించి మాట్లాడుతూ... ప్రస్తుత జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ అవసరం లేదన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications