రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణ కోసం అటు తన జియో ప్లాట్ఫాంలో వాటాలను ప్రపంచ దిగ్గజ కంపెనీలకు విక్రయిస్తూనే, మరోవైపు స్టార్టప్స్ కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఇందులోభాగంగా ఫ్యూచర్ రిటైల్ చైన్తో చర్చలు సాగుతున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా స్టార్టప్స్ మిల్క్ బాస్కెట్, అర్బన్ ల్యాడర్, జీవామీతోను చర్చలు జరుపుతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. భారీ మొత్తానికి ఈ డీల్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిల్క్ బాస్కెట్, అర్బన్ ల్యాడర్
ఈ-కామర్స్ వ్యాపార విస్తరణకు రిలయన్స్ వేగంగా ముందుకు సాగుతోంది. కిషోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ను విలీనం చేసుకునే యోచనలో ఉన్న రిలయన్స్ దేశీయంగా మరికొన్ని కంపెనీల కొనుగోలుకు చర్చలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీ అర్బన్ ల్యాడర్ పైన కూడా దృష్టి పెట్టారట. అలాగే మిల్క్ డెలివరీ కంపెనీ మిల్క్ బాస్కెట్ను కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది.

చర్చలు సఫలమయ్యే దిశలో..
అర్బన్ ల్యాడర్తో చర్చలు సఫలమయ్యే దిశలో ఉన్నాయని తెలుస్తోంది. 30 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.225 కోట్లు)కు డీల్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఈ-కామర్స్ ఫార్మసీ స్టార్టప్ నెట్మేడ్స్తో పాటు జీవామీలో మెజార్టీ వాటా కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతోంది.

మిల్క్ బాస్కెట్..
మిల్క్ బాస్కెట్ ఇంతకుముందు బిగ్ బాస్కెట్, అమెజాన్తో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో మిల్క్ బాస్కెట్ సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతో ఇందుకు వేచిచూసే ధోరణితో మిల్క్ బాస్కెట్ ఉన్నట్లుగా చెబుతున్నారు. 1.5 కోట్ల డాలర్ల వ్యాల్యూగా మిల్క్ బాస్కెట్ అంచనాలు వేస్తోంది. కరోనా కారణంగా ఇటీవల మిల్క్ ఉత్పత్తులతో పాటు గ్రోసరీకి డిమాండ్ పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications