రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) 43వ ఏజీఎం సమావేశం జూలై 15, బుధవారం జరగనుంది. మొదటిసారి ఆన్లైన్ ద్వారా వార్షిక సాధారణ సమావేశం నిర్వహిస్తోంది ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ. ఇందుకు సరికొత్త వర్చువల్ ప్లాట్ఫాంను వేదికగా చేస్తోంది. దీని ద్వారా ఒకేసారి 500 ప్రాంతాల నుండి లక్ష మందికి పైగా షేర్ హోల్డర్లు లాగిన్ అయి సమావేశంలో పాల్గొనవచ్చు. ఇప్పటి వరకు ప్రత్యక్ష సమావేశం నిర్వహించేవారు. అప్పుడు బయటి ప్రాంతాల వారు పాల్గొనడానికి ఇబ్బందిగా మారేదు. దీంతో చాలామంది పాల్గొనలేకపోయేవాళ్ళు. ఈసారి ఎక్కడున్నా ఏజీఎం ప్రత్యక్ష ప్రసారానికి లాగిన్ కావొచ్చు.

ఆరామ్కో డీల్ ఏమైనా వెల్లడిస్తారా?
ఈ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ ఏం చెబుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఎందుకంటే గత ఏజీఎంలో ఇచ్చిన హామీ కంటే పది నెలల ముందే రిలయన్స్ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దారు. కంపెనీ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫామ్స్లోకి రూ.1.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించారు. బీపీతో ఇటీవల జాయింట్ వెంచర్ ప్రకటన చేశారు. గత 13 వారాలుగా కరోనా కారణంగా ఎన్నోకంపెనీలు ఇబ్బందుల్లో ఉంటే రిలయన్స్ మాత్రం భారీ మొత్తంలో పెట్టుబడులు సమీకరించింది. ఈ సమావేశంలో దాదాపు ఏడాది కాలంగా వేచి చూస్తున్న ఆరామ్కో డీల్ గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ముఖేష్ అంబానీ ఏం చెబుతారు
ఆయిల్ టు కెమికల్ డివిజన్లో సౌదీ ఆరామ్కోతో డీల్ ఉండనుందని గత ఏజీఎంలో స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. 20 శాతం వాటాతో 15 బిలియన్ డాలర్లు (రూ.1.06 ట్రిలియన్లు)కు ఈ డీల్ ఉండవచ్చునని అంచనా వేశారు. బోనస్ గురించి చెప్పవచ్చు.
ఆరామ్కోతో డీల్ గురించి ఈ ఏజీఎంలో ముఖేష్ అంబానీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
జియో ప్లాట్ఫాంస్ లిస్టింగ్, జియో ఫైబర్ ట్రాజెక్టరీ, 5G లాంచ్ వంటి అంశాలపై కూడా కీలక ప్రకటన వెలువడవచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితికి అనుకుణంగా మేడిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో రిలయన్స్ పాత్రను వెల్లడించనున్నారు.
జియో మార్ట్ ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడుతారు.
2016 ఏజీఎం సమావేశంలో జియో డిజిటల్ లైఫ్, 2017లో జియో స్మార్ట్ ఫోన్, 2018లో మాన్సూన్ హంగామా, జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ వంటివి ప్రకటించారు.
ఇప్పుడు రిలయన్స్ కొత్త ఆవిష్కరణలకు తోడు ఆరామ్కో వంటి డీల్స్ గురించి వెల్లడించే అవకాశముంది.

ఏజీఎం ఇష్యూ కోసం చాట్బోట్
బుధవారం (15) ఆన్ లైన్ ద్వారా ఏజీఎం నిర్వహిస్తున్నారు. లాగిన్ సహా ఈ ఆన్ లైన్ సమావేశంలో ఎలా పాల్గొనాలో షేర్ హోల్డర్లకు మార్గనిర్దేశనం చేసేందుకు రిలయన్స్ వాట్సాప్ చాట్బోట్ లాంచ్ చేసింది. లాగిన్ సహా ఈ ఆన్లైన్ సమావేశంలో ఎలా పాల్గొనాలో షేర్ హోల్డర్లకు 79771 11111 వాట్సాప్ నెంబర్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications