పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో గత ఏడాది ప్రభుత్వం పన్నులు పెంచింది. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మే 4వ తేదీ నుండి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 20 సార్లు పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబైలో రూ.100కు పైకి చేరుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రూ.105 కూడా క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి.

పన్నులు తగ్గిస్తే..
పెట్రోల్, డీజిల్ ధరలపై సర్వత్రా అసంతృప్తి నెలకొంది. ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ధరల పెరుగుదల భారంగా మారిందని సామన్యులు చెబుతున్నారు. పెరుగుదున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గింపు ఒకటే మార్గమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకు తోడు కరోనా సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు పెంచారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి. వీటిని నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గిస్తుందని భావిస్తున్నారు. అయితే ఎప్పుడు అనేది స్పష్టత లేదు.

సమన్వయంతో వెళ్తే తగ్గుదల
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. పెరుగుతున్న ధరల కట్టడికి ఓ సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ, సెస్ అంశంపై ఆర్బీఐ సూచన చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగి, పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయని అభిప్రాయపడింది.

జీఎస్టీ పరిధిలోకి వస్తేనే...
ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని, అంతర్జాతీయంగా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ముడి సరుకు, లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంది. దేశంలో చమురు ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మార్పిడి రేటు పైన ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు ప్రభుత్వాల పన్నులు, సెస్, దిగుమతి సుంకాలు ఉంటాయి. డీలర్ కమిషన్, సరకు రవాణా ఛార్జీలు జత కలుస్తాయి. ప్రస్తుం పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావడం లేదు. దీనిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు తగ్గుతాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications