ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ఫర్నీచర్ రిటైలర్ అర్బన్ ల్యాడర్లో మెజార్టీ వాటాలు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ విస్తరణ పైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ (RRLV).. అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్స్ సొల్యూషన్ లిమిటెడ్ను దక్కించుకుంది. ఈ డీల్ వ్యాల్యూ రూ.182.12 కోట్లు. దీంతో అర్బన్ ల్యాడర్ సంస్థలో 96 శాతం వాటాలు RRLV చేతికి వచ్చాయి. అంతేకాదు, మిగతా వాటాను కొనుగోలు చేసే హక్కు కూడా RRLV పొందింది. అలా అయితే అర్బన్ ల్యాడర్.. RRLVకు వంద శాతం అనుబంధ సంస్థగా మారుతుంది.

96 శాతం వాటా.. రెండేళ్లలో పూర్తి
అర్బన్ ల్యాడర్లో 96 శాతం వాటాలను దక్కించుకున్నట్లు RRLV శనివారం రాత్రి స్టాక్ ఎక్స్చంంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఈ కంపెనీలో భవిష్యత్తులో మరో రూ.75వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2023 డిసెంబర్ నాటికి ఈ డీల్ పూర్తి కావొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ తన సంస్థల్లోకి అంతర్జాతీయ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు, దేశీయంగా పలు సంస్థలను కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో జియోలో, ఆ తర్వాత రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో గూగుల్ సహా పలు సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. అదే సమయంలో ముఖేష్ అంబానీ ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలను కొనుగోలు చేస్తున్నారు. ఈ పెట్టుబడులకు ఎలాంటి ప్రభుత్వ, రెగ్యులేటరీ అనుమతులు అవసరం లేదని చెబుతున్నారు.
ఆసియా ధనవంతుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ప్లాట్ఫాంలోకి 20 బిలియన్ డాలర్లను సమీకరించారు. ఇందులో ఫేస్బుక్తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి.

2012లో ప్రారంభమై...
మన దేశంలో అర్బన్ ల్యాడర్ 2012 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. డిజిటల్ ప్లాట్ ఫాంపై అర్బన్ ల్యాడర్ ఫర్నీచర్ వ్యాపారం నిర్వహిస్తోంది. పలు నగరాల్లో రిటైల్ స్టోర్స్ చైన్ ఉంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పెట్టుబుడులు పెట్టడంతో అర్బన్ ల్యాడర్ మరింత పుంజుకోనుంది. అర్బన్ ల్యాడర్ 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.434 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. నికర లాభం రూ.49.41 కోట్లుగా నమోదయింది. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.151.22 కోట్ల టర్నోవర్, 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.50.61 కోట్ల టర్నోవర్ చేసింది.

కఠిన పరిస్థితులు..
ఎనిమిదేళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అర్బన్ ల్యాడర్ వ్యాల్యూ 2018లో రూ.1200 కోట్లుగా ఉంది. అయితే 2019లో దీని వ్యాల్యూ రూ.750 కోట్లకు పడిపోయింది. ఇటీవలి కాలంలో అర్బన్ ల్యాడర్ కఠినపరిస్థితులు ఎదుర్కొంది. ఆశిష్ గోయల్, రాజీవ్ శ్రీవాత్సవ 2012లో దీనిని ప్రారంభించారు. టాప్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుండి రూ.700 కోట్లకు పైగా సమీకరించారు. సిక్వియా కాపిటల్, సెయిఫ్ పార్టునర్స్, కలారీ కాపిటల్, హెడ్గే ఫండ్ వంటి సంస్థల నుండి సమీకరించారు. గత ఏడాది మరో రూ.15 కోట్లు సమీకరించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications