కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మార్కెట్లు కుదేలైపోయాయి. ఉద్యోగాలు పోతున్నాయి. జీతాలు తగ్గుతున్నాయి. టాప్ కంపెనీల సీఈవోలు ఏం చేయాలి.. జీతంలో కోత విధించుకోవాలి.. భారీగా తగ్గించుకోవాలి. అవును అలానే చేశారు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ. గత ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు.

జీతం వద్దు..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో నయా పైసా జీతం తీసుకోలేదు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండటంతో ఆయన తన పారితోషికాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. రిలయన్స్ సంస్థ తాజా వార్షిక నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ పారితోషికం ''శూన్యం'' అని పేర్కొంది.

ఏడాదికి రూ.15 కోట్లు
అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.15 కోట్లు జీతం పొందారు. పదకొండేళ్ళ నుంచి ఆయన ఇదే విధంగా జీతం తీసుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన తన జీతం, భత్యాలు, కమిషన్ కలిపి రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. సంవత్సరానికి దాదాపు రూ.24 కోట్లకు పైగా ఆయన వదులుకున్నారు.

శాలరీ వద్దని చెప్పి
రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది జూన్లో విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం సమాజం, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగాలపై తీవ్రంగా పడినందువల్ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ డి అంబానీ తన జీతాన్ని వదులుకోవాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

వారికి మాత్రం పెరిగాయి..
రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ పారితోషికాలు పెరిగాయి. వారు రెండేళ్ళలో తమ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను పొందారు. ప్రసాద్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు పొందారు. అంతకుముందు సంవత్సరం ఆయన రూ.11.15 కోట్లు పొందారు. కపిల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.24 కోట్లు పొందారు. అంతకుముందు ఏడాది ఆయనకు రూ.4.04 కోట్లు లభించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications