పలురకాల రుణాలపై మారటోరియం (చెల్లింపులకు విరామం) గడువును మరింత పొడిగించే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. కరోనా సంక్షోభ కాలంలో రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకుండా కేవలం మారటోరియం గడువును మాత్రమే పెంచుకుంటూ పోతే రుణాలపై వారి వైఖరిలో మార్పులు రావచ్చని, తద్వారా ఉద్దేశపూర్వక ఎగవేతలు పెరగొచ్చని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా సంక్షోభం, దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రుణాలు పొందినవారికి ఊరట కల్పించేందుకు ఆర్బీఐ.. తొలుత మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటించగా, ఆ తర్వాత గడువును మరో మూడు నెలలు పెంచి ఆగస్టు 31 వరకు పొడిగించింది. అయితే మరోసారి మారటోరియం గడువు ను పొడగించొద్దని, ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్, హెచ్డీఎ్ఫసీ చైర్మన్ దీపక్ పరేఖ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ సహా పలు ప్రముఖ బ్యాంకు చీఫ్ లూ ఆర్బీఐని వేడుకుంటున్నారు.

మారటోరియం పొడగింపును కొందరు అవకాశంగా తీసుకునే ప్రమాదముందని, స్తోమత ఉన్నప్పటికీ రుణగ్రహీతలు ఈ వసతిని దుర్వినియోగం చేస్తున్నారని బ్యాంకుల అధినేతలు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ అన్లాక్తో వ్యాపార, కార్పొరేట్ రంగ కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతున్నాయని, ఆదాయ పునరుద్ధరణతో మారటోరియం లో ఉన్న రుణఖాతాలూ తగ్గాయని బ్యాంకర్లు అంటున్నారు. అయితే, ఉపాధి కోల్పోయిన అసంఘటిత వర్గాలు కాకుండా, వేతం పొందే వర్గాల్లోనూ సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు రిపోర్టులు వెల్లడవుతోన్న వేళ ఆర్బీఐ, బ్యాంకులు తదుపరి ఎలాంటి చర్యలకు దిగుతాయనేది చర్చనీయాంశమైంది.
నిజానికి, ఆర్థికంగా ఇప్పటికీ గడ్డు పరిస్థితుత్ని ఎదుర్కొంటున్నవారు, ఇప్పట్లో ఆదాయం పెరిగే అవకాశంలేని కంపెనీలకు ఆర్బీఐ ఇదివరకే ప్రకటించిన ఏకకాల రుణ పునర్వ్యవస్తీకరణ (వన్టైం లోన్ రీస్ట్రక్చర్) ఏమేరకు ఫలితాన్నిస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్తోపాటు రిటైల్ రుణ గ్రహీతలూ ఈ వసతిని ఉపయోగించుకోవచ్చని ఈనెలలో నిర్వహించిన పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులు వీరికి రుణ చెల్లింపుల గడువును గరిష్ఠంగా రెండేళ్లపాటు పొడిగించవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ లోన్ రీస్ట్రక్చర్ అవసరమైన, అర్హులైన వారికి మాత్రమే వర్తింపజేయాలని బ్యాంకులకు నిర్దేశించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications