కరెంట్ ఖాతాకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు విదేశీ బ్యాంకులను కలవరానికి గురిచేస్తున్నాయి. కరెంట్ ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు విదేశీ బ్యాంకులకు ఇబ్బందికర పరిణామంగా మారింది. మెరుగైన సేవలు అందించే సాకుతో కార్పోరేట్ సంస్థల నుండి సున్నా వడ్డీకి డిపాజిట్లు సేకరించడం ఇకపై సాధ్యంకాదు.

విదేశీ బ్యాంకుల్లో ఖాతా.. దేశీయ బ్యాంకుల అప్పులు
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా కార్పోరేట్ సంస్థకు కరెంట్ ఖాతాను ఓపెన్ చేస్తే ఆ సంస్థకు రూ.50 కోట్లకు పైగా అప్పు ఉంటే అందులో కనీసం 10 శాతాన్ని కరెంట్ ఖాతా తెరిచిన బ్యాంకు ఇచ్చి ఉండాలి. విదేశీ బ్యాంకులు కంపెనీలకు ఎలాంటి అప్పు ఇవ్వకుండానే ఆ కంపెనీల కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఆ కంపెనీలకు దేశీయ బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి.

డిపాజిట్లపై వడ్డీ చెల్లించకుండా..
కంపెనీలకు ఎలాంటి అప్పులు ఇవ్వకుండానే, డిపాజిట్లపై వడ్డీ చెల్లించకుండా దేశీయ కంపెనీలకు చెందిన పెద్ద మొత్తాలను మెరుగైన సేవలు అందించే పేరుతో విదేశీ బ్యాంకులు సమీకరిస్తున్నాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ఇప్పుడు దేశీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవల పేరుతో కార్పోరేట్ సంస్థల నుండి జీరో వడ్డీ నిధులను పొందలేవని సీనియర్ బ్యాంకు అధికారి తెలిపారు.

ప్రభుత్వరంగ బ్యాంకులకు మేలు
ఆర్బీఐ కొత్త నిబంధనల కారణంగా ఈ పద్ధతికి ముగింపు పలికినట్లు అయిందని చెబుతున్నారు. దీంతో కార్పోరేట్ సంస్థలకు భారీగా రుణాలు ఇచ్చే ప్రభుత్వరంగ బ్యాంకులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే విదేశీ బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండానే తెరవడానికి వీలు లేకుండా పోతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications