కంటిచూపు సరిగ్గాలేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మనీ (MANI) పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్ను తీసుకు వచ్చింది. దీనిని బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. ఈ అప్లికేషన్ సాయంతో కంటిచూపు సరిగాలేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా తయారు చేశారు.
ఆఫ్లైన్లో కూడా పని చేస్తుంది
ఈ యాప్ను ఐవోఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వంటి వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు దీనిని ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ యాప్ను ఓసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో లేకపోయినా అంటే ఆఫ్లైన్లో ఉన్నా కూడా పని చేస్తుంది. రెండు సులభమైన స్టెప్పులలో కరెన్సీని గుర్తించవచ్చు.
హిందీలో లేదా ఇంగ్లీష్లో సమాధానం
ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో సమాధానం ఇస్తుంది. భారత కరెన్సీకి అనేక ఫీచర్లు ఉంటాయని, అంధులు కూడా నోట్లను సులభంగా గుర్తించే విధంగా ఈ యాప్ రూపొందించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.

కొత్త నోట్లు గుర్తించేలా..
ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్ పేరుతో సైజులు, డిజైన్లలో మార్పులు చేసి 2016 నవంబర్ నెలలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లను విడుదల చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించేందుకు అంధులకు ఇబ్బందిగా మారిందనే వాదనలు ఉన్నాయి. ఈ కొత్త యాప్ అంధులకు సులభంగా నోట్లను గుర్తించేలా ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications