న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయన్ని తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ఆర్థికంగా మరింత ఊతం ఇచ్చేంతటి నిర్ణయం అది. వచ్చే మూడు నెలలకాలంలో మార్కెట్ నుంచి 25,000 కోట్ల రూపాయల మొత్తాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేబాశీష్ పండా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ జాతీయ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం కాలానికి 25,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించడానికి జాతీయ బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రెగ్యులేటరీ మార్గదర్శకాలను అందుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

చివరి రెండు త్రైమాసిక కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 40,000 కోట్ల రూపాయల మొత్తాన్ని సమీకరించాయి. ఈక్విటీ, ఏటీ-1, టయర్-2 బాండ్ల రూపంలో ఇంత భారీ మొత్తాన్ని సమీకరించాయి. దీనికి అదనంగా మరో 20,000 నుంచి 25,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సేకరించడానికి అనుమతి ఇచ్చినట్లు దేబాశీష్ పండా వెల్లడించారు. ఇదివరకు కెనరా బ్యాంకు-2,000, పంజాబ్ నేషనల్ బ్యాంకు-3,788.04 కోట్ల రూపాయల మొత్తాన్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా సమీకరించాయి.
దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం మరో 20,000 కోట్ల రూపాయలను జాతీయ బ్యాంకుల్లో మూలధన పెట్టుబడిగా పెట్టింది. అయినప్పటికీ.. పంజాబ్ అండ్ సింద్ వంటి కొన్ని బ్యాంకులు రెగ్యులేటరీ మార్గదర్శకాలను అందుకోలేకపోయాయి. ఫలితంగా- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో 5,500 కోట్ల రూపాయలను మూలధన పెట్టుబడిగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2019-2020 ఆర్థిక సంవత్సరంలో జాతీయ బ్యాంకులు ఏకంగా 70,000 కోట్ల రూపాయలను సమీకరించాయి.
ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్-16,091, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-11,768, కెనరా బ్యాంక్-6,571, ఇండియన్ బ్యాంక్-2,534 కోట్ల రూపాయల వాటా నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11.. లాభాలను ఆర్జించినట్లు దేబాశీస్ పండా తెలిపారు. నిరర్ధక ఆస్తులు (నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్-ఎన్పీఏ) తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఎన్పీఏ మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications