రూ.1000 లోపు హోటల్ గదిపై 12% జీఎస్టీ, వీటిలో మినహాయింపులు రద్దు
కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పుకు జీఎస్టీ మండలి మంగళవారం (జూన్ 28) ఆమోదం తెలిపింది. మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్డ్ ఫుడ్పై జీఎస్టీ విధించనున్నారు. చెక్స్ జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపై పన్ను విధిస్తారు. అంతర్రాష్ట్ర పరిధిలో జరిగే బంగారం, విలువైన రాళ్లను ట్రాన్సుపోర్ట్ చేయడానికి రాష్ట్రాలు ఈ-వే బిల్స్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చారు. పన్ను ఆదాయాల్లో మరింత వాటాను రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో జీఎస్టీ మండలి ఈ దిశగా నిర్ణయాలను తీసుకున్నది.
కేంద్ర
ఆర్థికమంత్రి
నిర్మలా
సీతారామన్
నేతృత్వంలో
జరిగిన
జీఎస్టీ
కౌన్సిల్
కీలక
నిర్ణయాలను
తీసుకున్నది.
రూ.1000
లోపు
అద్దె
ఉండే
హోటల్
వసతిపై
ఇక
నుండి
12
శాతం
జీఎస్టీ
విధిస్తారు.
ఇప్పటి
వరకు
దీనిపై
జీఎస్టీ
మినహాయింపు
ఉంది.
కానీ
మంత్రుల
బృందం
12
శాతం
జీఎస్టీ
విధించాలని
ప్రతిపాదించగా,
ఆమోదించింది.
క్యాసినో,
ఆన్
లైన్
గేమింగ్,
హార్స్
రైడింగ్
పైన
28
శాతం
జీఎస్టీ
విధించాలనే
ప్రతిపాదనపై
నేడు
(బుధవారం)
చర్చిస్తారు.
పోస్ట్
కార్డులు,
ఇన్లాండ్
లెటర్స్,
బుక్
పోస్ట్,
ఎన్వలప్స్
మినహా
అన్ని
పోస్టల్
సేవలపై
జీఎస్టీ
ఛార్జ్
చేయనున్నారు.
వ్యాపార
సంస్థలకు
ఉండే
నివాస
సముదాయాల
అద్దెలకు
ఇచ్చే
పన్ను
మినహాయింపు
తొలగనుంది.
రూ.2
లక్షలు
అంతకంటే
ఎక్కువ
బంగారం,
ఆభరణాలు,
విలువైన
రాళ్ల
రవాణాకు
ఎలక్ట్రానిక్
బిల్లు
తప్పనిసరిగా
ఉండాలని
సిఫార్స్
చేసింది
మంత్రుల
బృందం.
ప్యాకింగ్
చేయని,
లేబుల్స్
లేని,
బ్రాండ్
లేని
వస్తువులపై
జీఎస్టీ
మినహాయింపు
కొనసాగుతుంది.
బ్యాంకులు
జారీ
చేసే
చెక్కులపై
18
శాతం
జీఎస్టీ
వసూలు
చేయాలని
ప్రతిపాదించారు.
రోజుకు
రూ.5000
పైబడితే
రోగుల
నుండి
వసూలు
చేసే
హాస్పిటల్
గది
చార్జ్
పైన
5
శాతం
జీఎస్టీ
ఉంటుంది.
ఐసీయూను
మినహాయించారు.