వాల్మార్ట్ గ్రూప్కు చెందిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్పే, ఫోన్ రీఛార్జీలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక వ్యాల్యూ కలిగిన మొబైల్ రీఛార్జీలపై ట్రాన్సాక్షన్స్కు రూ.1 నుండి రూ.2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జీ ట్రాన్సాక్షన్ UPI ద్వారా చేసినా, ప్రాసెసింగ్ ఛార్జీ భారం పడుతుంది. UPI ఆధారిత ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్ పేమెంట్స్ యాప్గా ఫోన్పే నిలిచింది. పోటీ సంస్థలు ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీ వసూలు చేయడం లేదు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్పేతో పాటు ఇతర సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నాయి.
రూ.50 లోపు ఫోన్ రీఛార్జీ పైన ఛార్జీ ఉండవని తెలిపింది. రూ.50-రూ.100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్పే తెలిపింది. థర్డ్ పార్టీ యాప్స్లో అధిక ట్రాన్సాక్షన్స్ను ఫోన్పే నిర్వహిస్తోంది. సెప్టెంబర్లో 165 కోట్ల UPI ట్రాన్సాక్షన్స్ను ఫోన్పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటాను కలిగి ఉంది. రీఛార్జీకి సంబంధించి తాము చిన్నస్థాయి ప్రయోగాన్ని అమలు చేస్తున్నామని, ఇక్కడ కొంతమంది కస్టమర్లు మొబైల్ రీఛార్జీ కోసం చెల్లిస్తున్నారని తెలిపారు.

ఫోన్పే సహా పలు మొబైల్ పేమెంట్ యాప్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపులకు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తోంది. అయితే ఫోన్పే పైన మనీ ట్రాన్సాక్షన్, ఇతర ట్రాన్సాక్షన్స్ ఉచితంగా కొనసాగుతాయని తెలిపింది. 'ఛార్జీని వసూలు చేస్తున్న పేమెంట్ ప్లాట్ ఫామ్స్లో తమది ఒక్కటే లేదు. బిల్ పేమెంట్స్ పైన చిన్న మొత్తం వసూలు చేస్తున్నాం' అని ఫోన్ పే అధికార ప్రతినిధి తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications