కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో మరో ఉద్దీపన ప్యాకేజీ కావాలని కోరుతున్నాయి పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు. ఇప్పటికే ఏడాది కాలంగా కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. సెకండ్ వేవ్ అంతకంటే తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదేందుకు మళ్లీ ప్యాకేజీ కావాలంటోంది. కరోనా సెకండ్ వేవ్తో ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని పారిశ్రామిక రంగ సమాఖ్య PHDCCI అంటోంది.
ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్యాకేజీ తప్పనిసరి అని అంటోంది. ప్యాకేజీ భారీగా ఉండాలని కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు మొత్తం 17 సూచనలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసింది PHDCCI. పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని కోరింది. తద్వారా జాతీయ స్థాయిలో లాక్డౌన్ వంటివి వద్దని అభిప్రాయపడింది. అలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అని హెచ్చరించింది.

MSMEలను మరింతగా ఆదుకోవాలని, అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని(ECGLS) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని, ఈ పథకం కేటాయింపులను ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుండి రూ.6 లక్షలకు పెంచాలని కోరింది. కరోనా అదుపులోకి వచ్చే వరకు ఐటీ షోకాజ్ నోటీసులు వద్దని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి TDS రేటును 50% తగ్గించాలని, అలాగే చైనా స్టీల్ ఎగుమతులపై నిషేధం విధించాలని సూచించింది. స్టీల్ ఎగుమతులపై 35 శాతం సుంకం విధించాలని, అన్ని రకాల ఇనుప ఖనిజం ఎగుమతులపై ఒకే సుంకం ఉండాలని పేర్కొంది. ఆయుష్ పరిశ్రమ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని కోరింది. బ్యాంకుల్లో నగదు రహిత డిపాజిట్ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని కోరింది. టీకాల ఉత్పత్తిని స్వచ్చంధ లైసెన్స్ పద్ధతిలో చేపట్టేందుకు అనుమతించాలని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications