ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమణిని అమెరికా రాకెట్ లాంఛర్లు హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకు వస్తుందా అనే ఆందోళనలు కూడా చాలామందిలో కలిగాయి. కానీ ప్రస్తుతానికి చల్లబడింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ ధరలు తద్వారా పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

చమురు ధరలపై కేంద్రమంత్రి
60 డాలర్ల వరకు ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో 72 డాలర్లకు కూడా చేరుకున్నాయి. దీంతో ధరలు ముందు ముందు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా, శనివారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై స్పందించారు.

పెట్రో ధరలు పెరగవు... భయం అవసరం లేదు
చమురు ధరల పెరుగుదల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. చమురు ధరల పెరుగుదలపై భయపడాల్సిన అవసరమేమీ లేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుదల ఎక్కువగా లేదని, గత రెండు రోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగాయన్నారు.

మొదటి పది రోజుల్లో పెట్రోల్ ధర ఎంత పెరిగిందంటే?
2020 జనవరిలో మొదటి పది రోజుల్లో (1-10) పెట్రోల్ ధరలు 82 పైసలు, డీజిల్ ధర రూ.1.09 పైసలు పెరిగింది. శుక్రవారం వరకు పెరిగిన ధరలు శనివారం తగ్గాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతల కారణంగా పెరిగాయి. నిన్న ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.75.90, కోల్కతాలో రూ.78.48, ముంబైలో రూ.81.49, చెన్నైలో రూ.78.86, హైదరాబాద్లో రూ.80.71గా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications