ఇంధన ధరల్లో నేడు (మే 26, బుధవారం) ఎలాంటి మార్పులేదు. దేశీయ చమురురంగ కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నిన్న లీటర్ పెట్రోల్ పైన 23 పైసలు, లీటర్ డీజిల్ పైన 25 పైసలు పెరిగింది. నేడు స్థిరంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, లీటర్ డీజిల్ రూ.84.32గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి కేవలం 30 పైసల దూరంలో ఉంది.
డీజిల్ ధరలు రూ.92కు సమీపంలో ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57 వద్ద ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, లీటర్ డీజిల్ రూ.84.32, కోల్కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, ముంబైలో పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57, చెన్నైలో పెట్రోల్ రూ.95.06, డీజిల్ రూ.89.11గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా ఎందుకంటే?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యాట్ కారణంగా ధరల్లో మార్పు ఉంటుంది. రాజస్థాన్లో పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ ఉంది. అందుకే అక్కడ లీటర్ పెట్రోల్ పలు ప్రాంతాల్లో రూ.100 దాటింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోను ఎక్కువ వ్యాట్ ఉంది.
అందుకే ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ ట్యాక్స్ను వేయడం పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

రాజస్థాన్లో వ్యాట్ తగ్గించినా...
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్, కఠిన ఆంక్షలతో పెట్రోల్, డీజిల్ వినియోగం క్షీణించింది. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 75 శాతం డిమాండ్ పడిపోయింది. రాజస్థాన్లో పెట్రోల్ పైన 36 శాతం, డీజిల్ పైన 26 శాతం వ్యాట్ ఉంది. మణిపూర్ తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికైనా ఇది అత్యధికం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన 2 శాతం చొప్పున వ్యాట్ను తగ్గించింది. అయినప్పటికీ మణిపూర్(36.5 శాతం) తర్వాత రాజస్థాన్లో వ్యాట్ అధికం.

సామాన్యులపై పెట్రో భారం
సాధారణ పౌరులకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను ఆరు శాతం మేర తగ్గించాలని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునిత్ బాగాయ్ అన్నారు. రాష్ట్రంలో అధిక వ్యాట్ కారణంగా నిత్యావసర ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది సామాన్యులకు భారంగా మారిందన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications