పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సుముఖంగా లేవు. దీంతో చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం ఇబ్బందికరంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ధరలు భారీగా తగ్గుతాయనే వాదనలు ఉన్నాయి. ఈ వాదనను తాజాగా ఎస్బీఐ ఆర్థికవేత్తలు సమర్థిస్తున్నారు!

లీటర్ పెట్రోల్ రూ.75
చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.75కు దిగి వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. కానీ ఇందుకు రాజకీయ నేతలు సిద్ధంగా లేరని, అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డుస్థాయిలో ఉన్నాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, ట్యాక్స్లు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. అందుకే ప్రభుత్వాలు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు సుముఖంగా లేవని వీరు అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ గరిష్టం 28 శాతం
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా వివిధ రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తుండటంతో లీటర్ పెట్రోల్ పైన రవాణా ఛార్జీలు రూ.3.82, డీలర్ కమిషన్ రూ. 3.67, సెస్ రూ.30గా ఉంటోంది. డీజిల్ పైన రవాణా ఛార్జీలు రూ.7.25, డీలర్ కమిషన్ రూ. 2.53, సెస్ రూ. 20గా ఉంటోంది. అయితే వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే అత్యధికంగా 28 శాతం పన్ను మాత్రమే ఉంటుంది. అప్పుడు వినియోగదారులపై భారం భారీగా తగ్గుతుంది. కస్టమర్లపై రూ.28 వరకు భారం తగ్గి లీటర్ పెట్రోల్ రూ.75 వరకు అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అన్నారు.

ప్రభుత్వాలకు భారీ నష్టం
చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుందని అంచనా. దేశ జీడీపీలో ఇది 0.4 శాతం. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను మార్పు చేయకుండా, స్థిరీకరించాలని కూడా ఆర్థికవేత్తలు కోరారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications