17 రోజుల్లో పెట్రోల్ రూ.8.50, డీజిల్ రూ.10 పెరుగుదల: ఢిల్లీలో కేజ్రీవాల్ ట్యాక్స్ ఎఫెక్ట్తో...
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 17వ రోజు కూడా వాహనదారులకు షాకిచ్చాయి. మంగళవారం (జూన్ 23) ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 20 పైసలు, లీటర్ డీజిల్ పైన 63 పైసలు పెరిగింది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరల్ని సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి ధరల సమీక్ష ప్రారంభమైనప్పటి నుండి రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.
SBIపై
ఉద్యోగాలు,
వేతనాల
కోత
ప్రభావం
తక్కువ,
యోనో
ద్వారా
ప్రత్యేక
పథకాలు
వివిధ నగరాల్లో ధరలు
నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ పైన వరుసగా... ఢిల్లీలో పెట్రోల్ రూ.79.76, డీజిల్ రూ.79.40, జైపూర్లో రూ.87.01, రూ.80.36, ముంబైలో రూ.86.54, రూ.77.76గా ఉంది. పది ముఖ్య నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.80కి పైకి చేరుకుంది. కోల్కతా(రూ.81.45), ముంబై(రూ.86.54), చెన్నై(రూ.83.04), నోయిడా(రూ.80.45), బెంగళూరు (రూ.82.35), భువనేశ్వర్ (రూ.80.32), హైదరాబాద్ (రూ.82.79), జైపూర్ (రూ.87.01), లక్నో(రూ.80.55), పాట్నా (రూ.82.85), తిరువనంతపురం(రూ.81.48)గా ఉంది. డీజిల్ ధరలు ముంబై, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, పాట్నా, తిరువనంతపురంలలో ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్లో డీజిల్ ధర రూ.77.60గా ఉంది.
17 రోజుల్లో ఎంత పెరిగిందంటే
జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించిన ఈ పదిహేడు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.8.50, లీటర్ డీజిల్ ధర రూ.10.01 పైగా పెరిగింది.
ఢిల్లీలో
ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఈ రెండు ఇంధనాల మధ్య తేడా కేవలం 36పైసలు మాత్రమే ఉంది. సాధారణంగా పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కడైనా దాదాపు రూ.5 నుండి రూ.8 వరకు తక్కువ ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో పెట్రోల్, డీజిల్ మధ్య తేడా రూ.8కిపైగా ఉంది. వివిధ రాష్ట్రాల ట్యాక్స్, వ్యాట్ను బట్టి ఆయా ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడా ఉంటుంది. కేజ్రీవాల్ ప్రభుత్వం పెట్రోల్ పైన వ్యాట్ను 27 శాతం నుండి 30 శాతానికి, డీజిల్ పైన వ్యాట్ను 16.75 శాతం నుండి దాదాపుగా డబుల్ పెంచి 30 శాతం చేసింది. దీంతో డీజిల్ ధర ఢిల్లీలో ఎక్కువగా ఉంది. ఢిల్లీలో వ్యాట్ హైక్ తర్వాత డీజిల్ పైన రూ.7.10 పెరగగా, పెట్రోల్ పైన రూ.1.67 పెరిగింది.