క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం కస్టమర్లు తమ ఈ-వ్యాలెట్కు నగదును యాడ్ చేసుకుంటే 2 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు నుండి తమ ఈ-వ్యాలెట్లలోకి నెలకు రూ.10వేలకు మించి జత చేసుకుంటే రెండు శాతం ఫీజు చెల్లించలసి వచ్చేది. కానీ ఇక నుండి క్రెడిట్ కార్డు వినియోగంపై వ్యాలెట్ టాపప్ చేసుకుంటే చాలు ఛార్జ్ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా నగదును జత చేసుకుంటే రెండు శాతం నామినల్ ఛార్జీ ఉంటుందని, మీ బ్యాంకు/పేమెంట్ నెట్ వర్క్కు అధిక ఛార్జీలను తాము అధిక ఛార్జీలను చెల్లించవలసి వస్తోందని పేర్కొంది.

ఇలా జత చేసుకుంటే..
అయితే ఉచితంగా మీ వ్యాలెట్లకు నగదును పంపించుకోవడానికి యూపీఐ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించాలని పేటీఎం తమ కస్టమర్లకు ఓ సందేశాన్ని పంపించింది. నెట్ బ్యాంకింగ్ కూడా ఉపయోగించవచ్చునని తెలిపింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు పేటీఎం వ్యాలెట్లోకి డబ్బులు జత చేసేందుకు ఫీజును వసూలు చేస్తున్నాయని, కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు అలా జత చేస్తే రెండు శాతం ఛార్జ్ విధించబడుతుందని తెలిపింది. కాగా, క్రెడిట్ కార్డు ద్వారా కనీసం రూ.50 చొప్పున రూ.200 వరకు నగదు జత చేస్తే రెండు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చునని కూడా పేర్కొంది.

పండుగ సమయంలో ఆఫర్
ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆపర్లు ఇస్తున్నాయి. ఇటీవలి వరకు కరోనా కారణంగా సేల్స్ పడిపోయాయి. ఈ పండుగను క్యాష్ చేసుకోవాలని అన్ని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం కూడా వ్యాలెట్ నుండి బ్యాంకు అకౌంట్కు మనీ ట్రాన్సుఫర్ చేస్తే విధించే 5 శాతం ఛార్జీని తాత్కాలికంగా మాఫీ చేసినట్లు పేటీఎం ప్రతినిధులు వెల్లడించారు. తమ వ్యాలెట్లోని మొత్తాన్ని మరొక వ్యాలెట్ లేదా బ్యాంకు ఖాతాకు బదలీ చేయడానికి, ఆన్లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపడానికి, బిల్లు చెల్లింపుల ప్రాసెస్ కోసం, రీఛార్జీల కోసం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా లభిస్తాయని పేర్కొన్నారు.

2017లో ప్రారంభించి.. వెనక్కి
పేటీఎం 2017 నుండి క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాలెట్లోకి డబ్బును జత చేస్తే ఛార్జీ వసూలు చేస్తోంది. కానీ కస్టమర్ల ఒత్తిడి నేపథ్యంలో ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి దానిపై ఛార్జీ వసూలు చేస్తోంది. వడ్డీలేని క్రెడిట్ కార్డు మనీని దుర్వినియోగం చేయకుండా, అనవసరపు ట్రాన్సాక్షన్స్ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications