కరోనా మహమ్మారి కారణంగా విమాయానం, పర్యాటక, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే విమాన రంగాల్లో పెద్ద ఎత్తున వేతనం లేని సెలవులు, శాలరీ కోత విధిస్తోన్న విషయం తెలిసిందే. హోటల్ రంగంలోను అదే పరిస్థితి ఉంది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తాజాగా తమ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల వేతనంలో 25% తగ్గిస్తున్నట్లు తెలిపింది.

4 నెలల పాటు 25 శాతం వేతనం కట్
వరుసగా నాలుగు నెలల పాటు అంటే ఏప్రిల్ నుండి జూలై నెలలు 25 శాతం వేతనం తగ్గించుకొని తీసుకోవాలని కోరింది. అంతేకాదు, కొంతమంది ఉద్యోగులను ఏకంగా నాలుగు నెలలు (మే 4వ తేదీ నుండి ఆగస్ట్ 30 వరకు) సెలవులపై పంపించింది. వారికి అతి స్వల్ప ప్రయోజనాలు మాత్రమే కల్పించింది. కరోనా కారణంగా ప్రస్తుతం చాలా కంపెనీలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రోహిత్ కపూర్ ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.

అదనపు ప్రయోజనాల్లో మార్పు లేదు
ప్రస్తుతం మన కంపెనీ కఠినమైన, తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకుంటోందని, ఓయూ ఉద్యోగులు అందరు కూడా 25 శాతం వేతనం కట్కు అంగీకరించాలని కోరుతున్నానని ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఇది ఏప్రిల్ - జూలై మధ్య నాలుగు నెలలు ఉంటుందని తెలిపారు. కేవలం వేతనంలో మాత్రమే తగ్గింపు ఉందని, మిగతా అదనపు ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.

అందుకే కఠిన నిర్ణయం
లాక్ డౌన్ కారణంగా హోటల్స్ మూతబడ్డాయి. దీంతో రూమ్స్ బుకింగ్కు అవకాశమే లేదు. దీంతో ఓయో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హోటల్ బిజినెస్ కుంటుబడిందని రోహిత్ కపూర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలు ఆగిపోవడం, దేశఈయంగా వ్యాపారాలు స్తంభించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో అదనపు సహకారం
ఓయో హోటల్స్లో ఇండియాలో 7వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో చాలామందికి వేతనం కట్ కానుంది. అదే సమయంలో లీవ్ విత్ లిమిటెడ్ బెనిఫిట్స్ (కనీస సౌకర్యాలతో కొంతమందికి 4 నెలలు సెలవులు) కల్పించిన వారికి వైద్య బీమా, స్కూల్ ఫీజు రీయింబర్సుమెటంట్స్, ఎక్స్గ్రేషియా మద్దతు ఉంటుందని తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితి అయితే బీమా మొత్తానికి మించి సహకారం ఉంటుందని తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications